అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాల మేరకు అటు హస్తినలో టీడీపీ ఎంపీలు వరుసగా ఆరు రోజుల పాటు ఇస్తున్న అవిశ్వాస తీర్మాణం నేపథ్యంతో పాటు.. ఇటు రాష్ట్రంలో బీజేపిని ఎక్కడికక్కడ దోషిగా నిలబట్టేందుకు చేస్తున్న ప్రకటనలు, ప్రచారాల నేపథ్యంలో రాష్ట్రంలో కమలం వికసించే అవకాశాలు లేవన్న తరుణంలో ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం దిగివచ్చింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన అరోపణలు, విమర్శల పోరులో బీజేపిపై చంద్రబాబు పైచేయి సాధించారు.
ఈ క్రమంలో రాష్ట్ర విభజన చట్టంలో పోందుపర్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం.. మీరు ఓ పర్యాయం హస్తినకు రావాలని కేంద్రం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అయితే ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ప్రత్యేక హోదాను మాత్రం అసలు ప్రస్తావనకే తీసుకురాలేదని అన్నారు. అయితే విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారని తెలిపారు. ఈ తరుణంలో మనం ఏం చేద్దామని అయన పార్టీ ముఖ్యనేతల ముందు ఈ అంశాన్ని పెట్టి చర్చించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రతీక్షణం అప్రమత్తంగా వుండాలంటూ ఆయన సూచనలు ఇచ్చారు. కేంద్రం మనకివ్వాల్సిన నిధులపై కోతలు పెడుతూ.. ఇతర రాష్ట్రాలకు మాత్రం ధారాళంగానే నిధులను విధుల్చుతుందని అన్నారు. రాబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. తమకు ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీయే, యూపీఏలపై కోపం లేదని... ఏపీకి జాతీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయనేదే తన అవేదన అని అన్నారు.
ఈ టెలికాన్ఫరేన్స్ సమావేశం సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీలన్నింటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. వీటి విషయంలో ఇటు మనకు ఒకటి చెబుతూ.. అటు ప్రజల్లోకి మరోటికి తీసుకెళ్లిన కేంద్రమే స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యతని అన్నారు. ఇక ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో మనం కేంద్రం క్లారిటీ ఇచ్చిన తరువాతే వెళ్లాలని యనమల చెప్పారు. ఓ వైపు అవిశ్వాస తీర్మాణాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్రమంత్రులతో సమావేశం కావడం సమంజసం కాదని అన్నారు.
ఇలాంటి పరిణామాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తాయని చెప్పారు. కేంద్ర హామీలపై క్లారిటీ ఇచ్చిన పిమ్మట పార్లమెంటులో నిరసనలు అపిన తరువాత కేంద్రమంత్రులను కలసి సమావేశం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు ఎక్కడైనా కనిపిస్తే మర్యాదగా పలకరించుకోవడంలో తప్పు లేదని చెప్పారు. యనమల వ్యాఖ్యలతో చంద్రబాబు ఏకీభవించారు. కేంద్రం క్లారిటీ ఇచ్చిన తరువాతే వెళ్దమని చెప్పారు. కాగా, హీరో శివాజీ వెల్లడించిన 'ఆపరేషన్ ద్రవిడ' గురించి పయ్యావుల, పల్లె రఘునాథరెడ్డిలు ప్రస్తావించగా... అన్నీ పరిశీలిద్దామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more