మొన్నీ మధ్య మహారాష్ట్రలో వర్ణ పోరు జరిగిన విషయం తెలిసిందే. భీమా-కొరెగావ్ అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకిపోయింది. రైట్ వింగ్ నేత మనోహర్ అలియాస్ శాంభాజీ భిడే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆయన పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డు కోసం సిఫారసు చేయడం చర్చనీయాంశమైంది.
పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ 2016లోనే భిడేను ‘పద్మశ్రీ’ అవార్డు కోసం సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంగిలికి చెందిన 84 ఏళ్ల భిడే అలియాస్ భిడే గురూజీ తొలి నుంచీ వివాదాస్పద నేత. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడేతోపాటు రైట్ వింగ్కు చెందిన మరో నేత మిలింద్ ఎక్బోటేపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ భిడేపై మరో కేసు కూడా ఉంది. 2008లో ‘జోధా-అక్బర్’ సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్న కేసు కూడా అతడిపై నమోదైంది. ఇన్ని కేసులు ఉన్న ఓ నిందితుడిని ‘పద్మశ్రీ’ పౌర పురస్కారానికి సిఫారసు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎస్సెస్ మాజీ కార్యకర్త అయిన భిడేపై 2008 నుంచి కేసులు ఉన్నాయని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ తెలిపారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హయాంలో ఉండగా అరెస్ట్ చేయించలేకపోయిందని.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇలా గౌరవ పురస్కారాలకు సిఫార్సు చేయటం దారుణమని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more