ఓవైపు మత ఛాందస వాదుల వ్యవహారాలు .. మత ఘర్షణలు, లవ్ జిహాదీల వ్యవహారాలు వార్తల్లో నిలుస్తున్న వేళ.. మసీదు కోసం బ్రాహ్మణులు స్థలం దానం చేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పంజాబ్లోని బర్నాలా జిల్లా, మూమ్ గ్రామంలో ఈ అద్భుతమైన మత సామరస్య దృశ్యం గోచరిస్తోంది.
ఇంకో విశేషం ఏంటంటే.. దాని నిర్మాణానికి సిక్కులు డబ్బులు సమకూర్చారు. అంతేకాదు ఆ రెండు మతస్థులు మసీదు నిర్మాణానికి శ్రమదానం కూడా చేస్తున్నారు. మసీదు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్న 40 ఏళ్ల నజీమ్ ఖాన్ మాట్లాడుతూ..."ఇప్పటివరకు, మా గ్రామంలోని బాబా మొమిన్ షా మందిరంలోపల ఉన్న రెండు గదుల్లో ప్రార్థనలు చేస్తున్నాం. పండిట్ బిరదారీ కొంత స్థలాన్ని మసీదు కోసం దానం చేయడంతో మేము నిర్మాణాన్ని మొదలుపెట్టాం. వారు స్థలాన్ని ఇవ్వడమే కాకుండా మసీదు నిర్మాణానికి తమ వంతుగా శ్రమదానం చేస్తున్నారు. డబ్బులు కూడా సమకూర్చుతున్నారు" అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక మసీదు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సదరు గ్రామంలో ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న పండిట్ పురుషోత్తం లాల్ మాట్లాడుతూ.. ఓ పంజాబీగా, తమకు సంబంధించినంత వరకు మతాలకు అతీతంగా అందరూ సమానమేనని ఆయన అన్నారు. రాజకీయ నేతలు ఓట్ల కోసం మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారని, కానీ తాము వారి వలలో పడబోమని మూమ్ గ్రామస్థుడొకరు స్పష్టం చేశాడు. దాదాపు 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ గ్రామానికి శాంతియుత జీవనం, మత సామరస్యత పరంగా గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more