తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప జయకుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. అయితే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన తరువాత వారిపై అనుమానం కలిగిన దీప పోలీసులకు పిర్యాదు చేయడంతో.. దిమ్మతిరిగే వాస్తవాన్ని వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం డొంక కదిలింది. పోలీసులే విస్మయం వ్యక్తం చేసేలా తనతో విభేధాల కారణంగా దూరంగా వుంటున్న దీప అస్తి కాజేయడానికి అమె భర్త మాధవన్ సినీమా పక్కీలో ఈ ప్లాన్ వేసి, దానిని పలువురితో కలసి అమలు చేశాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
తనతో విభేదించి దూరంగా వుంటున్న దీప.. ఇటీవలి కాలంలో రాజకీయాలలో యాక్టివ్ గా మారడం.. అమె అర్కే నగర్ ఎన్నికలలోనూ పోటీ చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో అమె వద్ద కట్టల కొద్ది డబ్బు వుందని భావించిన మాధవన్.. అమెను డబ్బుపై కన్నేయడంతో పాటు అమెను తన దారికి తెచ్చుకోవాలంటే భయాంధోళనకు గురిచేయాలని చేసిన ప్రయత్నమే ఈ నకిలీ ఐటీ దాడులని తెలిసింది. అదాయపన్ను శాఖ అధికారిగా నటిస్తూ, సోదాలు జరిపి, ఆపై పోలీసులకు పట్టుబడిన వ్యక్తి ఈ మేరకు పోలీసుల విచారణలో చెప్పాడు.
దీప ఇంటిపై అసలు ఐటీ అధికారుల దాడి జరిలేదని, సినిమా పక్కీలో నకిలీ ఆదాయపు పన్ను అధికారులు కార్లలో వచ్చి దాడుల డ్రామా ఆడిన సంగతి తెలిసిందే. వచ్చిన వారు అధికారులు కాదని దీప కుటుంబీకులకు అనుమానం రావడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు దీప ఇంటికి వెళ్లేలోగానే నకిలీ ఐటీ గ్యాంగ్ జారుకుంది. ఆమె వద్ద భారీగా డబ్బుంటుందని భావిస్తూ, సినిమాలో చూపే మాదిరిగా దోపిడీ చేయాలన్న ఉద్దేశంతోనే వారు వచ్చుంటారని తొలుత భావించిన పోలీసులు, తాజాగా నిందితుడు వెల్లడించిన నిజాలతో మాధవన్ పై కేసు నమోదుకు కదులుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more