సామాన్యుల పట్ల ఓ తీరున, ప్రముఖుల పట్ల మరో తీరున వ్యవహరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మొండి బకాయిల కింద వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మెండి బకాయిల ఊబిలో కూరుకుపోయిన దేశీ బ్యాంకింగ్ దిగ్గజం.. ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ ప్రక్షాలన పేరుతో భారీ మొత్తంలోనే రుణాలను రైటాప్ చేసింది. గతేడాది పీఎస్బీలు అన్ని కలిపి 81 వేల 683 కోట్ల రూపాయలను మాఫీ చేసింది.
కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాదాపుగా 20 వేల కోట్ల రూపాయలకు పైగానే రుణాలు మాఫీ అయ్యాయని అధికారిక గణంకాల్లో వెల్లడైంది. సామాన్యులు నుంచి ముక్కి పిండి మరీ రుణాల డబ్బులను వసూటు చేసే బ్యాంకులు.. అవసరమైతే వారి అస్తులను జప్తు చేసి.. వేలం వేసి.. ఇతరులకు విక్రయించైనా తమ డబ్బును జమ కట్టుకునే బ్యాంకులు అదే పాలసీని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలపై చూపరు. ఏ ఏఢాదికా ఏడాది బ్యాంకులు వీరికి మాత్రం రుణాలను మాఫీ చేస్తూనే వున్నాయి. అసలు సామాన్యలుకు ఇంటి, వాహన రుణాలను అందించేందుకు అంక్షల మీద అంక్షలు పెట్టి అన్ని దస్తావేజులు పరిశీలించే బ్యాంకులు, వీరికి మాత్రం వేలు, వందల కోట్ల మేరు రుణాలను ఎలా ఇస్తున్నారన్నది అర్థంకాని ప్రశ్న.
సుమారు రూ.20,339 కోట్ల రుణాలను ఎగవేతదారులు చెల్లించలేదని బ్యాంకు రద్దు చేసింది. కాగా, ఎస్బీఐతో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 81,683 కోట్ల మొండి బకాయిలను ఇతర బ్యాంకులు రద్దు చేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.4348 కోట్ల బకాయిలను రద్దు చేశాయి. అసలు బ్యాంకుల్లో వున్న ప్రజాధనం మాఫీ చేసే అధికారం బ్యాంకులకు ఎవరిచ్చారని.. ఇలా చేస్తూనే.. ఖాతాదారులపై మాత్రం జరిమానాలు, ఫైన్ లు కట్టించుకుని.. ట్రాన్స్ యాక్షన్ల పరిమితిపై అంక్షలు తదితరాలు చేపడుతున్నారని సామాన్యులు గుసగుసలాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more