ప్రముఖ నటుడు, నిర్మాత, బాలాజీ టెలిఫిలిమ్స్ చైర్మన్ జితేంద్రపై లపై పోలీసులు లైంగిక వేధింపుల కేసును నమోదు చేసేందుకు ఉపయుక్తం అవుతున్నారు. జితేంద్రకు బంధువుగా పేర్కొంటున్న బాధితురాలు ఈ మేరకు పోలీసులకు అన్ లైన్ ద్వారా పిర్యాదు చేయడంతో.. ఈ ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చా.? లేదా..? అన్న విషయమై పోలీసులు న్యాయసలహాలను తీసుకుంటున్నారు. ఇక మరో విషయమ ఏంటంటే.. బాధితురాలిపై నటుడు లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా ఐదు దశాబ్దాల క్రితం.
తన బందువైన నటుడు జితేంద్ర తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపిస్తూ.. ఏకంగా 47 ఏళ్ల తరువాత హిమాచల్ ప్రదేశ్ పోలీసు బాస్ కు రెండు పేజీల లేఖ రాసింది. తనను లైంగికంగా వేధించిన జితేంద్రపై కేసు నమోదు చేయాలని కోరింది. ఈ లైంగిక దాడి జరిగిన సమయంలో తన వయస్సు కేవలం 18 అని, జితేంద్ర తన కన్నా పదేళ్లు పెద్దవాడని, అయనకు అప్పుడు 28 ఏళ్ల వయసుందని అమె పేర్కొనింది. అయితే అప్పట్లో జితేంద్రపై పిర్యాదు చేయడానికి తనకు ధైర్యం సరిపోలేదని, సంఘం, బంధువులు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక తాను మౌనంగా వున్నానని లేఖలో తెలిపింది.
మహిళ ఆరోపణలను జితేంద్ర తరపు న్యాయవాది కొట్టిపడేశారు. ఇదో అర్థం పర్థం లేని ఆరోపణ అని అన్నారు. 50 ఏళ్ల తర్వాత తన క్లైయింట్పై లైంగిక ఆరోపణలు చేస్తోందని, దీనిని కోర్టు కానీ, పోలీసులు కానీ విశ్వసించరని పేర్కొన్నారు. 1971లో ఓ సినిమా షూటింగ్ లో భాగంగా జితేంద్ర తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆమె లేఖలో ఆరోపించింది. షూటింగ్ స్పాట్ వద్ద తనను కారులో ఎక్కించుకుని ఢిల్లీ నుంచి ఓ హోటల్ రూముకు తీసుకెళ్లారని, అక్కడ రెండు వేర్వేరు బెడ్లు ఉన్నాయని పేర్కొంది.
ప్రయాణ అలసటతో తాను నిద్రపోయానని, అయితే కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూస్తే జితేంద్ర తన బెడ్పై ఉన్నారని, అతడి నుంచి మద్యం వాసన వచ్చిందని తెలిపింది. తనపై అత్యాచారం చేసిన అనంతరం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారని వివరించింది. ఆ రాత్రికి తాను అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని పోలీసుకు పంపిన రెండు పేజీల లేఖలో ఆమె పేర్కొంది. ఆన్లైన్ ద్వారా బాధితురాలి నుంచి లేఖను అందుకున్న ఎస్పీ కుషాల్ శర్మ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more