కామాతురానాం నభయం నలజ్జ అన్నట్లుగా వ్వవహరిస్తున్నారు పోకిరీలు. వయస్సు పైబడుతున్న కొద్ది సమాజంలో పేరుప్రఖ్యాతుల కోసం శ్రమించాల్సింది పోయి.. తన కూతురు సమానమైన అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాకు ఓ నడివయస్కుడు. అంతే కొద్దిసేపు అనుకోకుండా జరిగిందని నిమ్మకున్నా.. అదే పనిగా అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఓ నటి. ఇలా పోకిరీ అటకట్టించింది మరెవరో కాదు మలయాళ నటి సనూష.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బంగారం’ చిత్రంలో హీరోయిన్ మీరా చోప్రా చెల్లెలి పాత్రలో నటించిన సనూష.. ఓంకార్ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన ‘జీనియస్’ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా వ్యవహరిస్తున్న క్రమంలో తాను అతని కొద్దిసేపు గమనించానని, వెంటనే అతని చేయి పట్టుకుని ఎస్కార్టు పోలీసులకు అప్పగించానని చెప్పింది.
కర్ణాటకలోని మంగళూరు సెంట్రల్ నుంచి తిరువనంతపురం వెళ్లే మావెలి ఎక్స్ ప్రెస్ రైలులో.. కేరళకు చేరుకునేందుకు తాను ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పింది. తనకు కేటాయించిన బర్త్ లో తాను పడుకున్నానని.. ఆ తరువాత తమిళనాడు కన్యాకుమారీకి చెందిన వ్యక్తి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. పోకిరి అట కట్టించడం కంటే.. తాను బిగ్గరగా అతనిపట్ల అరుస్తున్నా. పక్కనున్నవారు ఏమాత్రం స్పందించకపోవడం చాలా అందోళన కలగించిందని అమె అవేదన వ్యక్తం చేసింది.
పోలీసులు వచ్చి పోకిరిని అదుపులో తీసుకున్నా తరువాత కూడా వారు స్పందించలేదని చెప్పింది. ఇప్పుడు తాను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉన్నా.. తనకు తన కుటుంబసభ్యుల నుంచి పూర్తి మద్దతువుందని తెలిపింది. కాగా ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు అంటూ ఈ సందర్భంగా సనూష మహిళాలోకానికి అప్పీల్ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more