యత్రనార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అన్న సూక్తిని భారత దేశం పాటిస్తుంది, అచరిస్తుంది అని ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ప్రధాని మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంస్కృతి, సంప్రాదాయాలు బాసిల్లతున్న చోటే.. పరస్త్రీలపై మోజు పెంచుకున్న రావణాసురులు కూడా వుంటారని భారతావనిలో ప్రతినిథ్యం మహిళలపై చోటుచేసుకుంటున్న దారుణ అఘాయిత్యాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ ఏకంగా అత్యాచారాలకు కేంద్రంగా మారిందన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.
అయితే సాధారణ గ్రామీణ అడపడచుల నుంచి ప్రముఖులు, సెలబ్రీల వరకు ఈ లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు ఎవరూ మినహాయింపు కాదని, ఎవరి స్థాయిలో వారికి ఈ వేధింపులు వుంటాయన్న తాజాగా చెన్నైలో జరిగిన ఘటన నిరూపిస్తుంది. దక్షిణాధి ప్రముఖ సినీ నటి వద్దకు వచ్చిన ఓ కామాంధుడు అమెతో అడ్డదిడ్డంగా, వంకరగా మాట్లాడుతూ.. తన స్నేహితుడితో కలసి డిన్నర్ లో పాల్లోనాలని అమెను కోరడమే అతనిలోని కామవాంఛను ప్రస్పుటిస్తుంది.
నిన్నమొన్నటి వరకు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసిన కేసులో ఇబ్బందులను ఎదుర్కొన్న నటి అమలాపాల్ కు.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా.. ఇంకా టైం కలిసిరానట్టుంది. అమె తాజాగా లైంగిక వేధింపుల బారినపడింది. ఈ మేరకు చెన్నైలోని మాంబళం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని, పారిశ్రామిక వేత్త అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, అశ్లీల భావంతో మాట్లాడాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.
మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో కలసి అతని ఫాం హౌజ్ లోనే డిన్నర్ లో పాల్గోనాలని కు వెళ్లాలని అళగేశన్ కోరాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మాటలు, చేతలతో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more