బాలీవుడ్ నటి, నాటి హాట్ బ్యూటీ జీనత్ అమన్ పై అమె స్నేహితుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ అర్థిక రాజధాని ముంబైలోని జూహులో చోటుచేసుకుంది. ఈ మేరకు జీనత్ లమన్ ఇచ్చిన పిర్యాదును స్వీకరించిన పోలీసులు అమె స్నేహితుడు, వ్యాపారవేత్త అమన్ ఖన్నాపై ఈ మేరకు కేసు నమోదు చేశారు. అమెను అజ్ఞాత ప్రదేశంలో నిలువరించడంతో పాటు అమె పట్ల అమర్యాదగా నడుచుకున్నందుకు గాను పోలీసులు అమర్ ఖన్నాపై ఐపీసీ 304డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జీనత్ అమన్ కుటుంబానికి పరిచయస్తుడైన ముంబైకి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్నా కుటుంబంతో మంచి స్నేహం ఉంది. గత కొంత కాలం క్రితం ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అమర్ ఖన్నా కుటుంబంతో అన్నివిధాల తెగతెంపులు చేసుకుంది జీనత్ అమన్. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు. అయితే గత కొన్ని నెలలుగా అమర్ జీనత్ అమన్ తో సయోధ్యకు ప్రయత్నిస్తూ.. అమె వెంటపడ్డాడు.
ఒకనాటి స్నేహితుడు కావడంతో ఆమె కూడా అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో జీనత్ ను తన ఇంటికి ఆహ్వానించిన అమర్ ఖన్నా, ఆమె వచ్చిన తరువాత నిజస్వరూపం చూపించాడు. ఓ అజ్ఞాత వ్యక్తి సాయంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అమెను తన ఇంట్లో నిలువరింపజేయడంతో పాటు అమైపై అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు.. అమర్యాదగా నడుచుకున్నాడు. దీంతో అగ్రహం చెందిన అమె అమర్ ఖన్నాపై జూహు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
1970 ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ అయిన జీనత్ అమన్ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి, బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. 'హరే రామ్ హరే కృష్ణ', 'సత్యం శివం సుందరం', 'యాదోన్ కి బారాత్' వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చాయి. 1985లో మజార్ ఖాన్ ను వివాహం చేసుకున్న జీనత్ సినిమాలకు దూరం కాగా, ఆ దంపతులకు ఇద్దరు కుమారులు. 1998లో మజార్ చనిపోవటంతో ఇద్దరు కుమారులతో కలసి ఆమె ముంబైలోని జూహులోనే నివసిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more