కాళేశ్వరం ప్రాజెక్టు అత్యద్భుతమంటూ గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖరరావుగా, మంత్రి హరీష్ రావును కాళేశ్వర్ రావుగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
రాజ్యాంగాన్ని, రాజ్ భవన్ ను నరసింహన్ అవమానిస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. నరసింహన్ వ్యవహారశైలితో గవర్నర్ వ్యవస్థకే అపకీర్తి వస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై గవర్నర్ తీరు విచిత్రంగా ఉందని అన్నారు. కేసీఆర్, హరీష్ ల పేర్లు మాత్రమే మార్చినందుకు సంతోషంగా ఉందని... మరిచిపోయి రాజ్ భవన్ పేరును కూడా టీఆర్ఎస్ భవన్ గా మార్చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరు మార్పుపై ఎందుకు ప్రశ్నించలేదని భట్టి అన్నారు. రూ. 20 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు బడ్జెట్ ఎందుకు పెరిగిందో ప్రశ్నించారా? అని మండిపడ్డారు. ఆహా, ఓహో అంటూ పొగిడేముందు... ఆ ప్రాజెక్టును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
టీఆర్ ఎస్ భజన ఎక్కువైంది...
టీఆర్ఎస్ కు గవర్నర్ నరసింహన్ భజన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉందని, ఇకపై అవినీతి కేసులో గవర్నర్ నూ విచారించాల్సి వస్తుందని, నరసింహన్ ని తాము విడిచిపెట్టమని ఈ సందర్భంగా వీహెచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేస్తే మాట్లాడని గవర్నర్, టీఆర్ఎస్ భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పొన్నం ఫైర్...
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రభుత్వ పథకాలు మెచ్చుకుంటే పరవాలేదు గానీ.. సీఎంను కాళేశ్వర చంద్రశేఖర్రావుగా సంభోదించడమేంటి అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వీలుంటే నరసింహన్కు 'భజన శాఖ' కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజలు గవర్నర్ నరసింహన్ను కల్వకుంట్ల నరసింహన్రావు అని అనుకుంటున్నారని వ్యంగంగా అన్నారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్భవన్ ప్రతిష్ట మంటగలిసిందని పొన్నం అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more