పశుదాణా కుంభకోణంలో దోషిగా నిర్థారించబడి మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. సోదరి గంగోత్రి కన్నుమూశారు. అమె అనారోగ్యంతో బాధపడుతూ.. అదివారం రోజున మృతిచెందారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ అమె అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం వుంది. లాలూ తరపు న్యావాదులు అయన తరపున న్యాయస్థానంలో పేరోల్ కోసం అభ్యర్థించనున్నారు.
దీంతో లాలూ తన సోదరి గంగోత్రి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. లాలూ కన్నా నాలుగు సంవత్సరాలు పెద్దదైన గంగోత్రి తన సోదరుడంటే అమితమైన ప్రేమ. ఆమె లాలూను చిన్న వయసు నుంచే అభిమానించేదని, తన సోదరుడికి తిరిగి అధికారం దక్కాలని, మహాకూటమి అధికారంలోకి రావాలని మూడేళ్ల క్రితం ఆమె కఠోర ఉపవాస దీక్షలు చేసిందని తెలుస్తోంది.
తన సోదరుడిపై పశుదాణా కుంభకోణం కేసు అంతిమదశకు చేరుకున్నప్పటి నుంచి అమె అదే అందోళనలో వున్నట్లు సమాచారం. ఇక తీర్పు వచ్చిన తరువాత అమె ఆరోగ్యం క్షీణించిందని లాలూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక తన సోదరి మృతితో జైల్లో ఉన్న లాలూ ఆవేదనకు గురైనట్టు సమాచారం. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన నేడు పెరోల్ పిటిషన్ వేయనుండగా, మానవతాదృక్పథంతో కోర్టు ఆయనకు పెరోల్ మంజూరు చేయవచ్చని సమాచారం. లాలూ పెరోల్ పిటిషన్ పై ఈ ఉదయం 10 గంటల తరువాత కోర్టు విచారణ జరపనుంది.
జైలులో లాలూ చేస్తున్న పనేంటి.? అర్జిస్తున్నదెంత.?
ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలులో ఏం పని చేస్తున్నాడో తెలుసా.? అసలు ఆయన రోజువారి అదాయం ఎంతో తెలుసా.? దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూను పోలీసులు బిస్రా ముందా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో దోషులు కూడా ఏదో ఒక పనిచేయాల్సి వస్తుంది కాబట్టి.. లాలూకు కూడా ఇది తప్పలేదు. ఏం పని చేస్తారన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్న లాలూకు జైలు అధికారులు తోటమాలి (గార్డెనర్) పనిని అప్పగించారు.
అయితే గార్డనర్ గా పనిచేస్తున్న లాలూ రోజుకు రూ. 93 కూలీగా లభించనుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, జైలుకు వెళ్లిన లాలూ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది. దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తాను పోరాడతానని, తనను దోషిగా తేల్చి, జైలుకు పరిమితం చేయాలని చూసినా తన పోరాటంలో వెనకడుగు వేయబోనని తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపించారు. తమ మాట వినకుంటే ఎవరినైనా వేధించడం బీజేపీ నైజమని నిప్పులు చెరిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more