కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సభా హక్కుల నోటీసు జారీ అయ్యింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఆ నోటీసును పంపారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ పేరును వక్రీకరిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంపై ఈ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది.
బీజేిపీ నేత, రాజ్యసభ ఎంపీ భూపిందర్ యాదవ్ రాహుల్ గాంధీపై ఈ నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీ, అరుణ్జైట్లీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో jaitleyకి బదులు jaitlieగా పేర్కొన్నారన్నారు. ఇలా చేయడం ఆయనను అవమాన పరచడమేనంటూ యాదవ్ ఈ నోటీసు ఇచ్చారు.
రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడైనందు వల్ల ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు నోటీసును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్కు పంపారు. కాగా బీజేపి సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ వద్ద ఇప్పటికే రాహుల్ కు సంబంధించిన ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉంది.
ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా భారత ఆర్ధిక రంగం కుదేలైందని రాహుల్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మోడీ సర్కారును విమర్శించారు. మోదీ ప్రభుత్వం దృష్టిలో జీడీపీ అంటే స్థూల ఆర్ధిక వృద్ధి కాదనీ... ‘స్థూల విభజన రాజకీయాలు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ రాహుల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ...
‘‘ప్రధాని మోదీతో కలిసి ఆర్ధికమంత్రి జైట్లీ మేథస్సు రంగరించి సాధించిన స్థూల విభజన రాజకీయాల (జీడీపి)తో భారత్కు వచ్చింది ఇదీ...
నూతన పెట్టుబడులు : 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి.
బ్యాంకు పరపతి పెరుగుదల : 63 ఏళ్ల కనిష్టానికి దిగజారింది.
ఉద్యోగ కల్పన : 8 ఏళ్ల దిగువకు పడిపోయింది..
వ్యవసాయ జీవీఏ (స్థూల విలువ) వృద్ధి : 1.7 శాతం క్షీణించింది..
ద్రవ్యలోటు : 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది...
నిలిచిపోయిన ప్రాజెక్టులు : పైపైకి...’’ అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఇంతకు ముందు పోస్టులో ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించిన ఆయన... జైట్లీని ‘‘జైట్లై’’ అని సంబోధించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more