బ్యాంకింగ్ రంగ దిగ్గజం.. దేశీయ బ్యాంకుల్లో అతిపెద్దదైన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తమ కస్టమర్లకు న్యూఇయర్ గిప్టును ఇచ్చింది. సరిగ్గా నూతన సంవత్సరం అవిర్భావాన్ని పురస్కరించుకుని ఎస్బీఐ తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. రుణాలు తీసుకున్న కస్టమర్లకు వడ్డీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని కస్టమర్లకు తీపికబురును అందించింది. తమ బ్యాంకు బేస్ పాయింట్లను 0.3 శాతం (30 బేస్ పాయింట్లు) తగ్గించింది. ఫలితంగా 8.95 శాతం ఉన్న బేస్ రేట్ 8.65 శాతానికి చేరుకుంది.
బెంచ్ మార్క్ ప్రామాణిక కనీస వడ్డీ రేట్ల(బిపిఎల్ఆర్) 13.70 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. ఫలితంగా రుణాలపై వడ్డీ రేటు గణనీయంగా తగ్గనుంది. ఎస్బీఐ నిర్ణయంతో పాత బేస్ రేట్ ప్రకారం రుణాలు తీసుకున్న 80 లక్షల మంది ఖాతాదారులకు లబ్ధి చేకూరనుందని బ్యాంకు రిటేల్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పికే గుప్తా తెలిపారు. ఈ నిర్ణయంతో ముఖ్యంగా రిటైల్ వ్యాపారులు, గృహ రుణాలు తీసుకున్న వారు, విద్యార్థులకు పెద్ద ఊరట లభించనుందని అన్నారు. ఎస్బీఐ తాజా నిర్ణయం వెనువెంటనే అమల్లోకి వస్తుందని అన్నారు.
గత నెలలో ఎంసీఎల్ఆర్ ను తగ్గించిన నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ కు బేస్ రేటుకు మధ్య వత్యాసం చాలా వుండిందని, తమ తాజా నిర్ణయంతో ఈ రెండింటి మద్య గ్యాప్ తగ్గిపోతుందని అన్నారు. బేస్ పాయింట్లు తగ్గించినప్పటికీ అదనపు నిధుల సమీకరణ ఖర్చుల ఆధారంగా మంజూరు చేసే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్) ను మాత్రం 7.95 శాతం వద్ద అలాగే ఉంచింది. కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి, ఇతర బ్యాంకుల నుంచి గృహ రుణాలను ఎస్బీఐకి మార్చుకునే వారికి ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు గడువును మార్చి వరకు పొడిగించింది. కాగా, ఎస్బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా బేస్ పాయింట్లను తగ్గించనున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more