సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యన్ మరోమారు అంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓ సమస్య విషయమై వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ట్విట్టర్ ద్వారా అయన మరోమారు చంద్రబాబు ప్రభుత్వాన్ని సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కోరారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యపై మరోమారు గళమెత్తిన ఆయన ఇప్పటికే విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. యాజమాన్యం తప్పిదం వల్ల అమాయక విద్యార్థులు మానసిక అందోళనకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
ట్విట్టర్ ద్వారా ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యను ప్రభుత్వం త్వరగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. మనం కోల్పోయే ప్రతీ గంట సమయం మన భవిష్యత్ ను దురదృష్టకరం చేసుకోవడమే అవుతుందన్న నెపోలియన్ వ్యాఖ్యలను ఊటంకిస్తూ విద్యార్థులకు త్వరితగతిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. బాధ్యతరాహిత్యం, అత్యాశతో ఫాతిమా కాలేజీ యాజమాన్యం తప్పిందం చేస్తే.. దానికి విద్యార్థులు ఎందుకు బలిపశువులు కావాలని ఆయన ప్రశ్నించారు.
ఎంతో తెలివిగల ఫాతిమా విద్యార్థులు చాలా బాధ పడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు చేశారని, కానీ వారి బాధను గుర్తించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేశాయని పవన్ మండిపడ్డారు. ఫాతిమా మెడికల్ కళాశాల చేసినట్లు విదేశాల్లో జరిగితే జరిమానా విధించి, అనుమతులను రద్దు చేసి, మేనేజ్మెంట్ను జైలుకు పంపేవారని పవన్ కల్యాణ్ అన్నారు. సదరు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ కాలేజీలో చేర్పించారని అన్నారు.
విద్యార్థులు ఎంతో శ్రమ పడి ఫాతిమా కళాశాలో విద్యను పూర్తి చేశారని, కళాశాల యాజమాన్యం చేసిన తప్పిదంతో వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడిందని, దీంతో వారు అందోళన చెందుతున్నారని జనసేనాని అన్నారు. వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్ ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని, వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలవాలని పవన్ కల్యాన్ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more