వివాహితతో అక్రమ సంబంధం ఏర్పర్చుకోవడమే కాకుండా.. ఆమెతో చనుపు పెంచుకుంటున్నాడన్న అక్కస్సుతో.. చిన్ననాటి స్నేహితుడ్ని కడతేర్చాడు.. ఓ నయవంచకుడు. పార్టీ చేసుకుందామని చెప్పి.. నయవంచనతో తీసుకెళ్లిన మద్యం సేవించి పడుకున్న మిత్రుడి గొంతును నిర్థాక్షిణ్యంగా కోసి.. హతమార్చాడు. శంషాబాద్ ప్రాంతంలోని ఓ నిర్జన ప్రాంతంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్నిహితుడిని సజీవదహనం చేసి అనంతరం క్లీనింగ్ కోసం కారును సర్విసింగ్ కు ఇచ్చారు. కారు సర్విసింగ్ సెంటర్ తో పాటు కాలిన శవం గుర్తించినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసిన దర్యాప్తు చేయడంతో.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
పరువు హత్యగా వెలుగుచూసిన ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. నిందితులందిరినీ తాము అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్లగా, హైదరాబాద్ పాతబస్తిలో రమేష్, పురోహిత్ మహేష్ అనే ఇరుగుపొరుగింటి యువకులు చిన్ననాటి స్నేహితులు. రమేష్ ఇంట్లో వున్న ఓ గదిలోకి అద్దెకు దిగిన వివాహితతో రమేష్ అక్రమసంబంధం ఏర్పర్చుకున్నాడు. రమేష్ చర్యలను దగ్గరినుంచి చూసిన మహేష్ అదే వివాహితతో చనువుగా వున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పేరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు పరస్పరం వార్నింగ్ లు కూడా ఇచ్చుకున్నారు. వారి మధ్యనున్న స్నేహబంధం కూడా అప్పటి నుంచే తెగిపోయింది.
అయితే రమేష్ అక్రమ సంబంధం విషయాన్ని మహేష్ వివాహిత భర్తతో కూడా చెప్పాడని, దీంతో వారు ఆ ప్రాంతంలోని ఇంటిని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో మహేష్ పై కక్ష గట్టిన రమేష్.. అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. మళ్లీ స్నేహ హస్తం అందించాడు. మహేష్ రమేష్ స్నేహాన్ని పూర్తిగా నమ్మాడు. గత వారం ఇద్దరు మరికొందరు న్నేహితులతో కలసి పార్టీ కూడా చేసుకున్నారు. అదే మాదిరిగా మైసిగండి వద్ద పార్టీ వుందని చెప్పి.. మహేష్ ను తీసుకెళ్లిన రమేష్ ముందస్తుగానే అతన్ని హత్య చేయాలని ప్రణాళిక రచించుకున్నాడు.
మైసిగండి వద్దకు వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న తరువాత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో.. మద్యం సేవించి నిద్రపోతున్న మహేష్ ను చూసి తన వెంట తెచ్చుకున్న కత్తితో మహేష్ గొంతును కోసి హత్య చేశాడు రమేష్. ఈ చర్యతో షాక్ కు గురైన కారులోని మరో ఇద్దరు స్నేహితులు నివ్వెరపోగా, తనకు అన్యాయం చేశాడనే చంపానని రమేష్ వారిని సముదాయింది. దీంతో స్థానికంగా వున్న ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లిన అక్కడి నుంచి పది లీటర్ల పెట్రోల్ తీసుకుని వచ్చి.. కొన ఊపరితో కొట్టుమిట్టాడుతున్న మహేష్ ను మదనపల్లి గ్రామ శివార్లలో సజీవదహనం చేశారు. కాగా రమేష్ సహా అతనికి సహకరించిన ఇద్దరు మిత్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more