తమిళనాడులోని ఉడుమల్ పేటలో జరిగిన పరువు హత్యలో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గత ఏడాది మార్చి 13న వధువు తండ్రి కొత్త జంటపై కత్తులతో దాడి చేయగా, వరుడు అక్కడికక్కడే ప్రాణాలను కొల్పయాడు. అతని భార్య మాత్రం తీవ్ర గాయాలపాలైంది. ఈ పరువు హత్య కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులో వధువు తండ్రితో పాటుగా మరో ఐదుగురికి మరణశిక్షను విధించింది. మరో అయిదుగురికి జీవిత ఖైదు శిక్షను విధించింది. కాగా మరోకరికి మాత్రం మూడేళ్ల శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే, శంకర్ అనే దళిత యువకుడు కౌశల్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అంగీకరించలేకపోయిన కౌశల్య తండ్రి ఉడుమల్ పేట బస్టాండ్ వద్ద పబ్లిక్ గా శంకర్ దంపతులపై దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... కౌశల్య తీవ్ర గాయాలపాలైంది. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజ్ వైరల్ గా మారింది. తమిళనాట ఆ హత్య సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1500 పేజీల రిపోర్ట్ ను తయారు చేశారు.
ఈ హత్య ఉదంతాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం కేసు విచారణ కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించింది. తిరుపూర్ సెషన్స్ కోర్టులో నవంబర్ లో కేసు విచారణ పూర్తయింది. తుది తీర్పును ఈరోజు కోర్టు వెలువరించింది. మొత్తం ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవితఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. న్యాయమూర్తి నటరాజన్ ఈ తీర్పును వెలువరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more