ప్రజలు నీతి, న్యాయం, ధర్మాన్ని అనుసరించాలని, అన్యాయాలు, అక్రమాలు, హింసా మార్గాలను వీడాలని మన నేతలు దేశ స్వాతంత్ర సమరయోధుల జన్మదినాల రోజునో లేక వర్థంతి రోజనో నివాళులు అర్పించి.. వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునీయడం సాధారణమే. అయితే వీటిని అచరించే వాళ్లు ఎంతమంది వుంటారు..? ఇది ప్రశ్నార్థకమే. ఎవడెలా పోతే నాకేంటి.. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే వారి సంఖ్య రానురాను మరీ ఎక్కువైపోతుంది. ఈ క్రమంలో తమ బస్తీలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన ఓ మహిళకు ఘోరపరాభవం ఎదురైంది.
సభ్య సమాజంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. పోలీసులుగా వారు చేయలేని పని ఓ మహిళమణి ధైర్యంగా చేస్తే.. కనీసం అమెకు రక్షణ కల్పంచలేని పోలీసులు అసలు రక్షక భటులేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహిళను ధైర్యాన్ని అభినందించి అమెకు అండగా నిలబడాల్సిందిపోయి.. లిక్కర్ మాఫియా నుంచి వచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు.. అమెకు జరిగిన అన్యాయం గురించి చెప్పినా పట్టించుకున్న పాపన పోలేదంటూ.. ఎంతటి దారుణంగా పరిస్థితి మారిందో అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడో దేశ మూల నుంచి ఎవరో రాసిన ఉత్తరంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నే ప్రధాని. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సోదరుడు వేసే వేషాన్ని చూసే ప్రధాని.. దేశరాజధానిలో.. అందునా మహిళలు అధికంగా అత్యాచారాలకు గురవుతున్న సందర్భంలో.. కనీసం ఇలాంటి ఘటనలపైనైనా మాత్రం స్పందించరా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. దేశ రాజధాని కేంద్రంగా ఎన్నో విదేశీ దౌత్యకార్యాలయాలు వున్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. ఇప్పటికే భారత పర్యటనపై తమ దేశస్థులకు పలు అంక్షలు విధించిన విదేశాలు.. ఇలాంటి ఘటనలే పునరావృతమైతే భవిష్యత్తులో ఎలాంటి అంక్షలు విధిస్తారో కూడా అలోచించాల్సిన అసవరం ఏర్పడుతుంది.
"उन्होंने धमकी दी कि जो हश्र मेरा किया, वही दिल्ली महिला आयोग की अध्यक्ष @SwatiJaiHind का भी करेंगे। स्वाति जी का पता लेके गए हैं, धमकी दी है कि उन्हें भी सड़क पे लाके नंगा करेंगे" - DCW की वालंटियर के शब्द जिसको आज शराब माफिया ने नंगा करके पूरे इलाके में घुमाया है। शर्मनाक। pic.twitter.com/fa9qCoTifI
— Amit Mishra (@Amitjanhit) December 7, 2017
ఢిల్లీలోని పోలీస్ చౌకీ సమీపంలో నివసించే ప్రవీణ్ అనే మహిళ.. తమ బస్తీ నారెళ్లలో అక్రమంగా మద్యం అమ్ముతున్న విక్రేతలపై ఢిల్లీ మహిళా కమీషన్ కు పిర్యాదు అందించింది. ఈ అక్రమార్కుల వల్ల ప్రతినిత్యం తాము ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని కూడా సమాచారం అందించింది. దీంతో డిసిడబ్యూ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారి నుంచి పెద్ద స్థాయిలో అక్రమ మధ్యాన్ని కూడా స్వాథీనం చేసుకున్నారు.
అయితే జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన లిక్కర్ మాఫియాకు చెందిన అశా అనే మహిళ తన అనుచరులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్ ఇంటికి వచ్చి అమెపై దాడికి తెగబడింది. రాడ్లతో ఆమెను కొడుతూ బట్టలను చించి పారేసి నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం నిద్రావస్థలోకి జారుకున్నారు. కనీసం బాధిత మహిళ పిర్యాదు చేసిన తరువాతైనా స్పందించాల్సిన పోలీసులు కేవలం ఆమెపై దాడి మాత్రమే జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం కొసమెరుపు.
పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రవీణ డీసీడబ్ల్యూ వాలంటరీగా పని చేస్తోందని.. ఆమెకు అవమానం జరిగిన మాట వాస్తవమని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ అంటున్నారు. ఈ మేరకు రోహిణి డిప్యూటీ కమిషనర్ రాజ్ నీశ్ గుప్తాను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవీల స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.
"मैं अपनी जान तो बचा ली पर अपनी इज्जत नहीं बचा पाई उन लोगों ने सबके सामने मेरे कपड़े फार दिए... मुझे नंगा कर दिया.. मुझे बहुत मारा.. मैंने कोई गुनाह नहीं कीया, मैं तो नशे के खिलाफ जंग लड़ रही थी" निडर महिला जिसने शराब और ड्रग माफिया को खुली चुनौती दी। pic.twitter.com/qaedkIwPF5
— Amit Mishra (@Amitjanhit) December 7, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more