సీమ వాసుల్ని వీడుతున్న ఫాక్షనిజాన్ని తాను మళ్లీ పునికిపుచ్చుకుని ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే తన కౌర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఓ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ గా తన పనులలో నాణ్యత లేదని బిల్లులు అపిన అధికారులను ఏకంగా నడిరోడ్డుపై అపి మరీ దాడి చేస్తున్నాడు. నలుగురు అనుయాయువులను వెంటబెట్టుకుని ప్రభత్వ కార్యాలయానికి వచ్చి.. తన ప్రతాపాన్ని అమాయక ప్రభుత్వ అధికారులపై ప్రధర్శిస్తున్నాడు. కాంట్రాక్టరుగా తన పనితీరు సక్రమంగా వుందా లేదా..? అన్నది పరిశీలన చేసుకోకుండా.. అధికారులపై దాడి చేసి.. బాంబులేసి చంపుతానని బెదిరింపులకు పాల్పడటంపై ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ కౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరపాలక సంస్థలో కిష్టప్ప డిఫ్యూటీ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. చెత్త ఊడ్చే యంత్రం అవసరం కావడంతో.. దానిని నరసింహారెడ్డి అనే కాంట్రాక్టర్ సరఫరా చేశాడు. ఇందుకు గాను ఇప్పటికే అధికారులు రూ.23 లక్షలను చెల్లించారు. కాగా మరో రూ. 15 లక్షల రూపాయలను చెల్లించాల్సి వుంది. ఈ క్రమంలో ఈ యంత్రం లోపభూయిష్టమైనదని అధికారులకు అరోపణలు రావడంతో.. మిగిలిన డబ్బును చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో బిల్లు చెల్లింపులో జాఫ్యంతో ప్రశ్నించేందుకు అనంతపురం నగరపాలక సంస్థకు చేరకున్న నరసింహారెడ్డి.. అక్కడి ఇంజనీర్లను అసభ్యపదజాలంతో దుర్భాషలాడాడు.
ప్రభుత్వ కార్యాలయంలో సభ్యత, సంస్కారంతో ప్రవర్తించండీ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన డిఫ్యూటీ ఇంజనీర్ కిష్టప్ప విన్నవించాడు. అంతే రెచ్చిపోయిన నరసింహారెడ్డి నువ్వెవరు నన్న అడిగేందుకంటూ.. అతడిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మిలు కూడా ఆయనను మందలించారు. కార్పోరేటర్ లక్ష్మారెడ్డి అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. అయితే కార్యాలయంలో అంతమంది వున్నా ఎవరూ నోరు తెరవకపోగా, కిష్టప్ప మాత్రం తనను ప్రశ్నించడంతో అహం దెబ్బతిన్న నరసింహారెడ్డి ఆయనను టార్గెట్ చేశాడు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
ఈ ఘటన జరిగిన గంట తర్వాత బైక్పై ఇంటికి వెళ్తున్న కిష్టప్పను మార్గమధ్యంలో అడ్డుకున్న నరసింహారెడ్డి విచక్షణ రహితంగా దాడిచేశాడు. ముఖంపై కాలుపెట్టి బూతులు తిట్టాడు. ‘‘రేయ్ నాది జమ్మలమడుగు, నాతో పెట్టుకుంటే బాంబులు తెచ్చి మీ ఆఫీసుపై వేస్తానని’’ హెచ్చరించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు మద్దతుగా నగరపాలక సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. అధికారులపై దాడులను సహించబోమని, ఎస్పీని కలిసి నరసింహారెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తామని కమిషనర్ మూర్తి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more