ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు.. ఇప్పటికే కంప్యూటర్ల అనుసంధానంతో వచ్చిన సీఎన్సీ మెషీన్లు పరిశ్రమల్లో కార్మికులను నిరుద్యోగులుగా మార్చితే.. అటు ఐటీ రంగంలోకూడా వేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగస్థులను నిరుద్యోగులుగా మార్చివేస్తుంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైన నేపథ్యంలో ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకీన్సే మరో సంచలన విషయాన్ని వెల్లడించి ఉద్యోగస్థులలో అందోళన రేపింది.
మళ్లీ వ్యవసాయమే నయమన్న వెనకటి రోజులు వస్తున్నాయా..? వ్యవసాయానికి సాంకేతికతను జోడించి ఆ రంగంలో ఉత్పాదకతను పెంచే బృహత్తర మార్పులు రానున్నాయా..? అన్న సందేహాలను తెరపైకి తీసుకువస్తుంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్ సైన్స్, ఆటోమేషన్ వంటి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఎక్కువ అసక్తి కనబరుస్తుందని వీటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగస్థులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అంటోంది ఈ సంస్థ. ఈ ప్రమాధం బారిన భారత్ కూడా పడనుందని రీసర్చ్ సంస్థ వెల్లడించింది. వీటి ఫలితంగా 2030 నాటికి ఇండియాలో 11 నుంచి 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.
అతి ఎక్కువ ఉద్యోగాలను చైనా కోల్పోనుందని... ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోతారని తన నివేదికలో పొందుపరిచింది. చైనా, భారత్, అమెరికా, మెక్సికో, జపాన్ దేశాలు రోబోలు, ఆటోమేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది నిరుద్యోగులు కానున్నారని మెకిన్సే స్పష్టం చేసింది. అమెరికాలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలను కోల్పోతారని అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలే కాక... వర్ధమాన దేశాలు కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయని చెప్పింది.
ఆటోమేషన్ త్వరగా విస్తరిస్తోందని... దీని ప్రభావంతో మెషీన్ ఆపరేటర్లు, బ్యాక్ ఆఫీస్ ఉద్యోగులు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు ఎక్కువగా నష్టపోతారని చెప్పింది. నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు, నిర్వహణా ఉద్యోగాలపై కూడా భారీ ప్రభావం పడనుందని తెలిపింది. 46 దేశాల్లో సర్వే చేసిన మెకిన్సే... ఈ మేరకు తన నివేదికలో పొందుపరిచింది. ఉద్యోగాలను కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కూడా కష్టమవుతుందని... దీనికి తోడు విద్యను పూర్తి చేసుకున్నవారికి కూడా చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పింది. ఇదంతా జీతాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more