తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనంటూ ఇవాళ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి అర్డర్ కు భిన్నంగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ ను జారీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది.
నూతనంగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యయ నియామక పరీక్షలను నిర్వహించడం వల్ల పాత జిల్లాల వారీగా స్థానికులమైన తాము.. కోత్త జిల్లాల పరంగా పక్క జిల్లాలకు నాన్ లోకల్ అభ్యర్థులుగా మారుతున్నామంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పిటీషన్ లో అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని... కొత్త జిల్లాలకు ఆమోదం లేదని వీరి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని కోర్టుకు తెలిపారు. కొత్త జిల్లాల వల్ల పాత జిల్లాలలో స్థానికేతరులుగా అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు అదేశాలకు లోబడిన ప్రభుత్వం.. తన వైఖరిని మార్చుకుంది. పది జిల్లాలను పరిగణలోకి తీసుకునే మరోసారి టీఆర్టీ నోటిషికేషన్ విడుదల చేస్తామని స్పస్టం చేసింది. ఇక దీనికి దరఖాస్తు చేసుకునే గడువును కూడా మరో పక్షం రోజుల పాటు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు విన్నవించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more