గుంటూరు జిల్లా మాచవరంలో అనుమానిత మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల నుంచి అనుమానపు వ్యక్తులు ఏటీయం కేంద్రం వద్ద తచ్చాడుతున్నరని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించగా, ఏటీయం కేంద్రంలోకి వెళ్లిన మహిళ మాత్రం పోలీసులు అడ్డంగా చిక్కింది. అమెను జీపులో స్టేషన్ కు తరలించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మాచవరం పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్డులో గేట్ వే హోటల్ కు ఎదురుగా వున్న హెచ్డీఎఫ్సీ ఏటీయం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్ిరతం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఏటీయం కేంద్రంలోకి ఒక మహిళ లోపలకు వెళ్లింది. ఆమె లోపలకు వెళ్లగానే ఏటీఎంను మోషీన్ ను తెరవడం గేట్ వే హోటల్లోని సెక్యూరిటీ సిబ్బంది చూశారని పోలీసులు చెబుతున్నారు. అయితే అమెకు సెక్యూరిటీగా ఏటీయం కేంద్రం వద్ద కాపాలాగా వున్న ఇద్దరు మహిళలను చూడటంతో అనుమానం మరింత బలోపేతమైందని స్థానిక యువకుడు తెలిపాడు.
అయితే వీరిపై అనుమానంతో స్థానికులంతా గుమ్మిగూడి ఏటీయం కేంద్రం వద్దకు చేరుకోగా, కాపలాగా వున్న మహిళలు అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. లోపల ఉన్న మహిళను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించగా, హుటాహుటిన వచ్చిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మహిళల కోసం అక్కడే చాలాసేపు వెతికారు.వారు కనిపించకపోవడంతో దొరికిన మహిళా దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా, తాను లోనికి వెళ్లే సరికే ఏటీయం వెనుకబాఘం తెరచి వుందని చెప్పినట్లు సమాచారం. అయితే అమె వద్ద పోలీసులు బ్యాగ్ కూడా వుండటాన్ని గమనించి అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more