దేశంలో మహిళల భద్రత ఇంకా ప్రశ్నార్థకంగానే మారుతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మగమృగాళ్లు.. వావివరుసలు మర్చిపోయి.. వయస్సు తారతమ్యాలను పక్కనబెట్టి అడపడచులపై తోడేళ్లలా విరుచుకుపడి వారి బంగారు జీవితాలను తుంచేస్తున్నారు. వలస బతుకుల నేపథ్యంలో ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్లి.. అక్కడ సెక్యూరిటీ గార్డుగా స్థిరపడిన ఓ వ్యక్తి కుటుంబంలోని చిన్నారిపై మగమృగాళ్లు కాటేసాయి. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పది రోజుల పాటు అమెపై దాష్టికానికి తెగబడ్డారు.
వివరాలలోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని కాడుగోడిలో 17 ఏళ్ల పీయూసీ విద్యార్థినిని గత నెల 28న తన క్లాస్ మేట్ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అమెతో కాసింత పరిచయం వున్న రాఘవేంద్ర అనే రైల్వే స్టేషన్ లో టీ కొట్టు నడుపుకునే వ్యాపారి అమెను తన క్లాస్ మేట్ వద్దకు తీసుకెళ్తానని నమ్మించి కేఆర్ పురం సమీపంలోని కాడుగోడిలో వున్న క్లాసిస్ ఇన్ లాడ్జికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన బాలిక ప్రశ్నించగా, తన క్లాస్ మేట్ ఇక్కడే పార్టీ చేసుకుంటున్నాడని మాయమాటతో అమెను నమ్మించాడు. లాడ్జిలోని ఓ గదిలోకి తీసుకెళ్లిన రాఘవేంద్ర బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
అనంతరం రైల్వేలో కూలీలుగా పనిచేసే సాగర్, మంజునాయక్ లను పిలిచాడు. దీంతో వారు కూడా బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. ఒక రోజు గడిచిన తరువాత ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న లాడ్జి నిర్వాహకుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన మనోరాజన్ పండిత్ అనుమానం వచ్చి రాఘవేంద్ర, సాగర్, మంజునాయక్ లను విచారించాడు. పోలీసులకు ఈ విషయాన్ని చెప్పవద్దంటూ వారు అతడ్ని బతిమాలగా, అదే అదనుగా భావించి పండిత్ తన కూతురు వయస్సున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
స్నేహితురాలిని కలసి వస్తానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన తమ బిడ్డ రెండు రోజులైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో పోలీసులను అశ్రయించి పిర్యాదు సమర్పించాన బాలిక తల్లిదండ్రులు.. అమెను ఎలాగైనా కనిపెట్టాలని అర్థించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కూపీలాగి.. క్లాసిక్ ఇన్ లాడ్జిలో వున్న బాలికను బంధవిముక్తిరాలిని చేశారు. నిందితులైన రాఘవేంద్ర, సాగర్; మంజునాయక్, మనోరాజన్ పండిత్ లను కృష్ణరాజపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి దర్యాప్తు కోనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more