ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు 74 రూపాయల గీత దాటగా, అటు డీజల్ కూడా 63కు పైన కోనసాగుతుంది. అక్టోబర్ మాసంలోని తొలినాళ్లలో ఇంధన ధరలు పెరగడంతో అధికారంలోకి వచ్చిన కొత్తగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. కేంద్రం మాత్రం సుమారు తొమ్మిది రూపాయల మేర వడ్డిండిన ఎక్సైజ్ పన్నులోంచి రెండు రూపాయలను తగ్గించగా, ఆ తరువాత ఆ నెలవ్యాప్తంగా గణనీయంగా పెట్రోల్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే.
కాగా, అక్టోబర్ ముగిసి నవంబర్ నెల వచ్చేసరికి మళ్లీ ఇంధర ధరలకు మళ్లీ రెక్కటు వచ్చాశాయి. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ పెరుగుతున్న ముడిచమురు ధరలే కారణం. దీనికి తోడు సౌదీ అరేబియా రాజ కుటుంబంలోని పరిణామాల ప్రభావం చమురు మార్కెట్ పై పడింది. రెండేళ్లలో మొదటిసారిగా బ్యారెల్ ముడి చమురు 60 డాలర్లు దాటింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 64 డాలర్లుగా ఉంది. ఒక్క సోమవారమే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 3.5 శాతం పెరిగింది. ఒక్క రోజే ముడిచమురు ధర రెండున్నర డాలర్లు పెరగడంతో భవిష్యత్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వారం రోజుల్లో ముడిచమురు బ్యారెల్ 70 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
2015 జులై తర్వాత క్రూడాయిల్కు అత్యధిక ధర ఇప్పుడే పలుకుతోంది. ముడిచమురు ధరలు పెరగడంతో కేంద్రం రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని గత నెలలోనే తగ్గించింది. అయితే ప్రతీరోజు పెట్రోల్ ధర ఎంతోకొంత పెరుగుతుండడంతో వినియోగదారునికి ఊరట లభించడం లేదు. సెప్టెంబర్లో దేశంలో చమురు వినియోగం 9.9 శాతం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ. 74. డీజిల్ లీటర్ 63.29. ఆంధ్రాలో పెట్రోలు లీటరు రూ. 76, డీజిల్ లీటర్ 65.29 గా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more