విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో ప్రొఫెసర్ చీకటి కోణాలు వెలుగు చూశాయి. ఈ అంశంలో ఫ్రొఫెసర్ కు విద్యార్థి సంఘాల నేతలకు మధ్యవాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు ప్రోఫెసర్ పై బౌతికదాడులకు కూడా తెగబడ్డారు. దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విద్యార్థి సంఘాల అధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ అవరణలో అందోళన కార్యక్రమానానికి పూనుకున్నారు.
మార్కులు కావాలంటే తనను శారీరికంగా తృఫ్తి పర్చాలని మహిళా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న సాంస్కృత విభాగాధిపతి ఏడుకొండలు అంశాన్ని విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థినులు. దీంతో విద్యార్థి సంఘాల నేతలు ఫ్రోపెసర్ ను నిలదీశారు. మహిళా విద్యార్థినులను లైంగికంగా ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించారు. ఆందోళన చేపట్టి, ప్రొఫెసర్పై దాడికి దిగారు.
అనంతరం బాధిత విద్యార్థినులు మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి తమను ప్రత్యేకంగా గదిలోకి పిలిపించి వారితో అసభ్యంగా మాట్లాడేవాడని, క్లాస్ రూంలో పాఠాలు చెప్పే సమయంలోనూ శృంగారానికి సంబంధించిన మాటలు మాట్లాడేవాడని విద్యార్థినులు అరోపించారు. గతంలోనూ ఈ ప్రోఫెసర్ పై ఇటువంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వేధింపులు ఎక్కువయ్యాయని, తాను చెప్పినట్టు వినకుంటే అంతూ చూస్తానని బెదిరిస్తున్నాడని విద్యార్థులు తెలిపారు.
వేధింపుల ఫ్రొఫెసర్ ను అరెస్ట్ చేసేవరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అయితే ఏడుకొండలు మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవాలని బుకాయిస్తున్నాడు. విద్యార్థుల అటెండెన్స్ తక్కువగా ఉందని పరీక్షకు అనుమతించలేదని కావాలనే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. దీనిపై ఏయూ రిజిస్ట్రార్ తో మాట్లాడిన మంత్రి గంటా వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more