భరతమాత సాక్షిగా హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సాయంత్రం ప్రారంభించించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించామని, అనంతరం, కొత్త హంగులు సంతరించుకున్న కార్యాలయంలో పరిపాలనా కార్యక్రమాలను ప్రారంభించామని పార్టీ తెలిపింది.
పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పని చేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం విశాలమైన స్థలంలో హైదరాబాద్, అమరావతి నగరాలలో వేరేగా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తొలుత శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. పూజల అనంతరం కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, విద్యా రంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎస్. రాధాకృష్ణ, ప్రముఖ రచయిత సత్యానంద్, ప్రముఖ హాస్యనటుడు అలీ, పవన్ కల్యాణ్ అభిమానులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలుగులో రాసిన ఖురాన్ ని నటుడు అలీ బహూకరించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న హాజరయ్యారు. సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం నిరంతరం పని చేసే అలుపు ఎరగని కార్యకర్త మా నిమ్మల వీరన్న తో అంటూ పవన్ స్వయంగా ఓ ఫోటోను ట్వీట్ చేయటం విశేషం.
Saamijika, ardhika parivarthana Kosam nirantharam paniches alupu eragani karyakartha ma "Nimmala Veeranna" tho.. pic.twitter.com/7GDFjUuLu6
— Pawan Kalyan (@PawanKalyan) October 24, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more