భారీ విస్పోటనం ధాటికి ఇంటితో పాటు పక్కనున్న నాలుగు ఇళ్లు కూడా కుప్పకూలిపోయాయి. సోమవారం కర్ణాటక రాజధాని బెంగుళూరులో తీవ్ర విషాదం అలుముకుంది. బెంగుళూరులోని ఇజిపురా ప్రాంతంలో ఆరుగురు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. ఎజీపుర ప్రాంతంలోని ఓ ఇంట్లో వంట చేస్తున్న గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనమిది నెలల గర్భణీ మహిళ సహా ఆరుగురు మరణించగా, శిధిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు.. హుటాహుటిన రంగంలోకి దిగి.. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టారు. పలువురు బాధితులను శిధిలాల నుంచి రక్షించి చికిత్స కోసం అస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానిక అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. కాగా ఇవాళ ఉదయం వరకు తమతో వున్న వ్యక్తులు ఒక్కసారిగా మరణించడంతో.. తీవ్ర అవేదనకు గురవుతున్న మృతుల బంధువుల రోధనలతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఇక అటు అస్పత్రుల వద్ద కూడా, క్షతగాత్రులు అర్థనాధాలు వారి బంధవులు రోదనలతో విషాదం నెలకొంది.
బెంగళూరులో ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో కాసింత అలక్ష్యమో లేక నిర్లక్ష్యమో తెలియదు కానీ ఏకంగా అరుగురు ప్రాణాలను బలితీసుకుంది. ఎల్పీజీ సిలిండర్లతో ఎలా వ్యవహరించాలన్న విషయమై ఇదివరకు ఒకింత జాగ్రత్తలు, సూచనలు చేసిన కేంద్ర ఇంధన శాఖ.. ఈ మధ్యకాలంలో అసలు సూచనలను చేయడమే లేదు. కేవలం మారుతున్న అంతర్జాతీయ రేట్ల దృష్ట్యా సంస్థ దృష్టంతా రేట్లను ఎలా పెంచాలా..? లాభాలను ఎలా అందుకోవాలా..? అన్నదానిపైనే కానీ.. తప్పనిసరిగా ఏడాది, రేండేళ్ల కో పర్యాయమైనా ప్రతీ ఇంటిలో గ్యాస్ తనిఖీలు చేయాల్సిన బాధ్యతను కూడా ఆయా కంపెనీలు గాలికివదిలేస్తున్నాయి.
#Visuals Bengaluru: 4 houses collapsed partially in Ejipura Area due to cylinder blast; 3 dead, many still feared to be trapped under debris pic.twitter.com/36WLT85TSG
— ANI (@ANI) October 16, 2017
అనుమానాలు?
కాగా, కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి ఘటనపై అనుమానాలు ఉన్నట్లు మీడియాతో చెప్పారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే సిలిండర్ బ్లాస్ట్ అవునో కాదో విచారణలో తెలాల్సి ఉందని ఆయన అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థుల్లో ఎవరికీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేదని.. కాబట్టి ముందుగానే ఇది సిలిండర్ పేలుడు అన్న దృవీకరణకు రాలేమని మంత్రి వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more