ట్రాఫిక్ ఇబ్బందులు తీరాలంటే నగర ప్రజలు మరో 75 రోజుల పాటు నిరీక్షించక తప్పదని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. బెజవాడ ఇంధ్రకీలాంద్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా తాత్కాలికంగా ఏర్పడిన టాప్రిక్ ఇబ్బందులను ప్రజలు సంయమనంతో ఎదుర్కోవాలని సూచించారు. మరో 75 రోజుల్లో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడుతుందని.. అప్పటి వరకు వాహనదారులు ఓపిక పట్టాలని గౌతమ్ సవాంగ్ అన్నారు.
ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం వద్ద నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, ట్రాఫిక్ మళ్లింపులను ఆయన పరిశీలించారు. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఫ్రధాన వాటర్ వర్క్స్ వరకు కాలినడకన సందర్శించారు. ఆయనతో పాటు సోమా కంపెనీ ప్రతినిధులు, రోడ్డు భవనాల శాఖ అధికారులు కూడా పర్యటించి.. ఫైఓవర్ నిర్మాణంలో ఇబ్బందులను కమీషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నప్పటికీ ఫ్లై ఓవర్ నిర్మాణం దృష్ట్యా ఓపికపట్టి సహకరించాలని కోరారు.
వాహనదారులు ఇబ్బందులు పడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాలను మినహాయించి, మిగిలినచోట్ల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ట్రాఫిక్ అధికంగా వున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మెల్లిగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందుల కారణంగా కూడా పనులు ఆలస్యం అవుతోందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more