గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాలలో దాగివున్న నల్లధనాన్ని వంద రోజుల వ్యవధిలో దేశానికి రప్పించి.. దానిని దేశంలోని పేదవాళ్లందరి బ్యాంకు అకౌంట్లలో వేస్తానని చెప్పిన ప్రధాని మోడీకి కేరళకు చెందిన ఓ రైతు షాక్ ఇచ్చాడు. ప్రధాని మోదీ ఎన్నికల బాధ్యతలను చేపట్టి సుమారు వెయ్యి రోజులు దాటి కూడా వంద రోజులు పూర్తి చేసుకున్నా తమకు రావాల్సిన డబ్బు తమ అకౌంట్లలోకి రాలేదని భావించిన రైతు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖను ఎక్కుపెట్టారు. నల్లధనంలో తనకు రావాల్సిన వాటా తనకు కేటాయించాలని కోరుతూ లేఖను సంధించారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నల్లధనంలో తన వాటాగా రావాల్సిన రూ.15 లక్షలలో కనీసం రూ.5 లక్షలైనా తనకు ఇవ్వాలని కేరళకు చెందిన ఓ రైతు ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరాడు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో బతుకు దుర్భరంగా మారుతోందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.5 లక్షలు తన ఖాతాలో వేయాలని కోరాడు.
వయనాడ్కు చెందిన కె.చాతు (68) ప్రధానికి లేఖ రాస్తూ.. ‘‘దేశవిదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకుంటానని ఎన్నికల సమయంలో మీరు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాను అని హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. అయినా హామీ అలానే ఉంది. స్వాధీనం చేసుకున్న సొమ్ములో నా వాటా ధనాన్ని ఇవ్వండి. ప్రస్తుతానికైతే ఓ రూ.5 లక్షలు నా ఖాతాలో జమ చేయండి’’ అని వేడుకుంటూ తన ఖాతా నంబరును కూడా పేర్కొన్నాడు.
మాజీ మావోయిస్టు అయిన చాతు గతంలో సినీ నటుడు మమ్ముట్టికి వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు. అప్పట్లో ఓ సబ్బుల కంపెనీకి ఆయన ప్రచారం చేశారు. అయితే ఆ సబ్బును తాను నెల రోజులు వాడినా తెల్లబడలేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు నష్టపరిహారంగా రూ.50 వేలు ఇప్పించాలని కోరాడు. దీంతో దిగొచ్చిన సబ్బుల కంపెనీ చాతుకు రూ.30 వేలు చెల్లించి సమస్యను పరిష్కరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more