అవినీతి, అక్రమాలు ఎక్కడవున్నా.. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు తాను ఎంతటి ఉద్యమానికైనా సిద్దమని గత ఎన్నికలకు ముందు పల్లె పల్లె తిరిగి చెప్పిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారా..? అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు చంద్రన్న సంచార చికిత్స (104 వాహనాలు) ఓ ఉదహారణగా నిలుస్తుంది. చంద్రన్న రాజ్యంలో ప్రైవేటు సంస్థల బోజ్యం నడుస్తుందని.. లాభాపేక్ష లేని సంస్థలు.. లాభార్జనకు పూనుకుంటున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రన్న సంచార చికిత్స పగ్గాలు గత రెండేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. అయితే ఇది లాభాపేక్ష్ లేని సంస్థగా గుర్తింపుపోందినా.. వాస్తవానికి జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుందని సంస్థ ఉద్యోగులు అరోపిస్తున్నారు. తాము మీడియాను ఆశ్రయించి తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేసినా.. ఈ సంచార చికిత్సలోని లోటుపాట్లను, లోసుగులను మీడియా దృష్టికి తీసుకెళ్లినా తమపై కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరిస్తుందని ఉద్యోగులు అరోపించారు. తమ గోడును వెల్లబోసుకునేందుకు కూడా తమకు అవకాశమివ్వకుండా బెదిరింపులకు పాల్పడటం ఏంటిన ప్రశ్నిస్తున్నారు.
సంచార చికిత్సలో మందుల కొరత, ఉద్యోగులకు సమన్యాయం, కోర్కెలు, డిమాండ్లపైగానీ ఉద్యోగులెవరైనా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను అశ్రయిస్తే వేటు పడుతుందని హెచ్చరించినట్లు ఉద్యోగులు అరోపిస్తున్నారు. ఈమేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేసిందని కూడా చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలను ప్రారంభించింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వమే ఈ నిర్వహణ బాధ్యతలను చేపట్టగా.. రెండేళ్ల క్రితం నుంచి ఈ నిర్వహణా బాద్యతను పిరమిల్ స్వాస్థ్య అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అప్పట్నుంచీ ఈ వాహనాల్లో మందులు తగ్గిపోయాయి. కనీసం 60 రకాల మందులు ఉండాల్సి ఉంది. కానీ 15 నుంచి 18 రకాల మందులు లేవు. రక్తపరీక్షలు జరగడం లేదు. దీంతో 104 సిబ్బందిపై గ్రామీణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
మీడియాను అశ్రయించి సిబ్బందిపై నిర్వహణ సంస్థ బెదిరింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టడం, బదిలీలు చేయడం లాంటివి చేస్తున్నారని, నాలుగేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా పిరమిల్ స్వాస్థ్య సంస్థ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మీడియాకు చెబుతున్నారు. ఓవైపు నిర్వహణ సంస్థ ఇన్నిరకాలుగా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నా కనీసం కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.42 లక్షలు ఇస్తున్నా కనీసం మందులు ఇవ్వకపోగా సిబ్బందిని బెదిరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ పేదల సంచార చికిత్సపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more