సింగరేణి యాజమాన్యం అధికార గుర్తింపు సంఘం కోసం జరిగిన ఎన్నికలలో గనుల్లో అధికార పార్టీ మరోమారు తన సత్తాను చాటడంతో ‘కారు’గర్జన మునపటికంటే అధికంగా ప్రతిధ్వినించింది. రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ మరోసారి విజయం సాధించింది. గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో మాత్రమే గెలిచిన టీబీజీకేఎస్ .. ఈసారి ఏకంగా 9 చోట్ల గెలిచి సత్తా చాటింది. మిగిలిన రెండు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచింది. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 49 వేల 873 మంది కార్మికులు ఓట్లు వేశారు.
94. 93 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, కార్పొరేటు ఆఫీసు, శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం 1, 2, 3 డివిజన్లలో టీబీజీకేఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ సంస్థ కలిసి బరిలోకి దిగాయి. అయినా ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ ఏరియాల్లో విజయం సాధించింది టీబీజీకేఎస్. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి.
ఏరియాల వారీగా విజయం
కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయం
ఇల్లెందు ఏరియాలో టీబీజీకేఎస్కు 217 ఓట్ల మెజార్టీతో గెలుపు
మణుగూరులో 631 ఓట్లతో టీబీజీకేఎస్ విన్
బెల్లంపల్లిలో 174 ఓట్లతో టీబీజీకేఎస్ విజయం
కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ కు 771 ఓట్ల మోజారిటీ
శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ 2,215 ఓట్లతొ విజయదుందుబి
మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 విజయం
భూపాలపల్లిలో ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపు
రామగుండం–1లో టీబీజీకేఎస్ 366 ఓట్ల మెజార్టీతో విజయం.
రామగుండం–2లో టీబీజీకేఎస్ 764 ఓట్ల మెజార్టీతో గెలువు
రామగుండం–3లో ఏఐటీయూసీ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more