భారతీయ రిజర్వు బ్యాంకు నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో అర్థిక రంగ నిపుణుల, మార్కెట్ వర్గాల అంచనాలే నిజమయ్యాయి. దేశ ఆర్థికాభివృద్ధి మందగిస్తున్న అర్థిక రంగ నిపుణులు, విశ్లేషకుల అంచనాలతో అర్బీఐ కూడా అంగీకరించింది. దేశ వృద్ది రేటు నెమ్మదిస్తుందనేందుకు సంకేతంగా అంచనాలను సవరించింది. అనుకున్నంత మేర వృద్ది రేటు నమోదు కాదని తాజాగా తమ అంచనాలను సవరించింది.
ఈ నేపథ్యంలో క్రమంగా ద్రవ్యోల్భణం కూడా పెరుగుతున్నందున ఇవాళ నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించిన అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులకు పూనుకోలేదు. ఈ క్రమంలో విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టుగా వడ్డీ రేట్లలో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సీఆర్ఆర్ లలో ఎలాంటి తేడాలు లేవని స్పష్టం చేస్తూ యథాతథంగానే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
ఉర్జీత్ పటేల్ అధ్వర్యంలోని ద్రవ్యపరపతి విధాన సమీక్షా కమిటీ రెపోెరేటును యథాతథంగా ఆరుశాతం కోనసాగించాలని నిర్ణయించింది. రివర్స్ రెపో రేటు, సీఆర్ఆర్లలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా 5.75శాతం, 4శాతంగా ఉంచారు. అయితే ఎస్ఎల్ఆర్ ను మాత్రం 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 19.5శాతానికి కుదించారు. ఈ ఆర్థిక సంవత్సరం వృధ్దిరేటు మరింత తక్కువగా నమోదవుతుందని అర్బీఐ అంచనా వేసింది. గతంలో 7.2గా అంచనా వేయగా, ఈ సారి మాత్రం అది 6.7గా నమోదవుతుందని అంచనాను సవరించింది. ఇక ద్రవ్యోల్భణం మాత్రం 4.2 నుంచి 4.6శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more