ప్రయాణికులకు మరోసారి రైల్వే శాఖ తీపి కబురును అందించింది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసే రైల్వే ఈ-టికెట్లపై సేవా రుసుము మినహాయింపును మరో అరు నెలల వరకు పొడగించింది. దీంతో వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సర్వీసు చార్జీ మినహాయింపు లేకుండా అన్ లైన్ లో టికెట్లను పొందే అవకాశం ప్రయాణికులకు అందింది. గత ఏడాది నవంబర్ మాసంలో పాత పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను తగ్గుముఖం పట్టించి, డిజిటల్ లావాదేవీలను ప్రేరేపించడంలో భాగంగా ఈ మినహాయింపును తొలిసారిగా ప్రయాణికులకు కల్పించింది రైల్వేశాఖ.
ఆన్లైన్ లో ఈ–టికెట్లపై సేవా రుసుముకు కేంద్రం తాత్కాలికంగా మినహాయింపు ప్రకటించింది. తొలుత ఈ మినహాయింపును ఈ ఏడాది మార్చి వరకు ప్రకటించిన రైల్వే శాఖ ఆ తరువాత దానిని మరో అరు మాసాలు పెంచుతూ సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. సెప్టెంబర్ 30 కూడా దాటిపోవడంతో.. తాజాగా ఈ మినహాయింపును 2018 మార్చి 31వరకు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టికెట్లపై రూ.20 నుంచి రూ.40 వరకు గతంలో సేవా రుసుం వసూలు చేసింది.
కాగా మార్చి 2018 వరకు ఈ డిజిటల్ మినహాయింపుకు కల్సించినట్లు ప్రకటించి రైల్వే శాఖ తమ ప్రయాణికులకు తీపికబరును అందించింది. దీంతో ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఐఆర్సీటీసీకి టికెట్ల అమ్మకంతో రూ.1500 కోట్ల ఆదాయం రాగా దీనిలో రూ.540 కోట్లు కేవలం సేవా రుసుముల ద్వారా వచ్చింది. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more