కేంద్రంలో ఎవరి ప్రభుత్వం అధికారంలో వుంటూ దేశంలో వారి పెత్తనం నడుస్తుందన్నది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. ఒక వేళ అలా కాని పక్షంటో కేంద్ర సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా చెప్పుకునే అధికార పంజరంలోని చిలుకలుగా మారాయని స్వయంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించిన సంస్థలూ రంగంలోకి దిగి.. కేంద్రంలోని అధికార పార్టీకి దేశంలోని అన్ని పరిస్థితులు అనుకూలంగా మార్చేవిధంగా చర్యలు తీసుకుంటాయి. దారి రప్పించుకుంటాయి.
సరిగ్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తి.. నిజాలను బహిర్గతం చేస్తున్న ఎన్డీటీవి.. ఇక బీజేపి చేతికి వెళ్లినట్టే. దీంతో ఇక ఆ ఛానెల్ లో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ప్రసారం కావని ఓ జాతీయ మాద్యమ సంస్థ కథనం వెల్లడించింది. బడ్జెట్ క్యారీయర్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ యజమాని, సహ వ్యవస్థాపకులైన అజయ్ సింగ్ ఎన్డీటీవీలో సుమారు రూ. 600 కోట్ల పెట్టుబడులను పెట్టిన నేపథ్యంలో ఇక ఎన్డీటీవీ ఆయన చేతికి వెళ్లినట్లే.
అయితే స్పైస్ జెట్ చేతికి వెళ్లిన ఎన్డీటీవీ. బీజేపికి ఎలా సొంతం అవుతుందనేగా మీ సందేహం.? అక్కడికే వస్తున్నాం. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రచార బృందానికి అజయ్ సింగ్ నేతృత్వం వహించారు. గత ఎన్నికలలో దేశవ్యాప్తంగా నమో మంత్రం.. మోడీ మానియా అంటూ నినాదాలతో పాటు అబ్ కి బార్, మోదీ సర్కార్ అన్న నినాదాన్ని కూడా ప్రజల్లోకి ఉదృతంగా తీసుకువెళ్లిన వ్యక్తులలో అజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారని సమాచారం.
దీంతో ఇక ఎన్డీటీవీతో పాటుగా ఎడిటోరియల్ హక్కులను కూడా అజయ్ సింగ్ సొంత చేసుకున్నట్లేననని, ఈ మేరకు అనధికార వర్గాలు తమకు సమాచారం అందించాయని జాతీయ మాద్యమ సంస్థ వెల్లడించింది. కాగా స్పైస్ జెట్ కు చెందిన ఓ అధికారి మాత్రం ఈ కథనం సత్యదూరమైందని, నిరాధరమైందని తోసిపుచ్చారు. మరికొన్ని రోజులు అగితే ఏది సత్యమో మనకే తెలిసిపోతుంది కదూ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more