న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని షహీద్ ఖకాన్ అబ్బాసీ భారత్ కోల్డ్ స్టార్ట్ యుద్ధ విధానాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప లక్ష్య అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్థాన్ అణుభద్రమైన చేతుల్లోనే ఉందన్న అందోళన వద్దని, భారత్ కోల్డ్ స్టార్ట్ యుద్ధ వ్యూహాన్ని నిలువరించేందుకు స్వల్పశ్రేణి అణ్వాయుధాలను తయారు చేశామని చెప్పిన విషయం తెలిసిందే.
ఆ తరువాత ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లో ఏర్పాటువాదుల అంశాన్ని ప్రస్తావించారు. అయితే కాశ్మీర్ అంశంలో భారత్ పాక్ దేశాల మధ్య చర్చలతో పరిష్కారం వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అంశంలో యుఎన్ జోక్యం అవసరమని కూడా చెప్పారు. కాశ్మీర్ లో యుద్దనేరాల కోసం ఐక్యరాజ్య సమితి ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించాలని కూడా కోరారు.
అయితే అంతకుముందు ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడిన అప్ఘనిస్తాన్ ప్రతినిధులు.. పాకస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని అరోపించారు. ఉగ్రవాదుల అణిచివేతతో పాటు వారిని పూర్తిగా నియంత్రించిన పక్షంలోనే తమ దేశంతో పాటు అసియా దేశాలలో శాంతిసామరస్యతలు వెల్లివిరుస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. దీంతో అప్ఘనిస్తాన్ లో భారత్ కు ఎం పనని కూడా పాకిస్థాన్ ప్రధాని అబ్బసీ నిలదీశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎవరి చేతిలోనూ గొర్రెగా కాదలుచుకోలేదని అన్నారు. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్వర్యంలో పాకిస్థాన్ పనిచేసేందుకు సిద్దంగా వుందని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more