తన ఇద్దరి శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ న్యాయస్థానం విధించిన 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తుండగా, అతని డేరాలలో తొవ్విన కొద్ది చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. తన గది నుంచి డేరాలో మహిళా భక్తుల గదులకు వెళ్లేందుకు సోరంగాలను ఏర్పాటు చేసుకున్న విషయం వెలుగుచూసినప్పటి నుంచి డేరా సచ్ఛా సౌదా బాబా గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాబా కాదు నరరూప రాక్షసుడని సాక్ష్యాత్తు న్యాయస్థానమే వ్యాఖ్యానించిందంటే.. అతని అగడాలు ఎంతలా వున్నాయో అర్థమవుతుంది.
బాబా రామ్ రహీమ్ అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన డేరాలో బంధీలుగా వున్న 18 మంది మహిళలను విముక్తుల్ని చేయడం నుంచి ప్రారంభమైన పోలీస్ అపరేషన్.. ఆ తరువాత డేరాలో 500లకు పైగా అస్థిపంజరాలను కునుగోని విస్తుపోయారు. దీంతో డేరా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్ దాఖలు కావటంతో ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి.
సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో 800 వందల ఎకరాల విస్తీర్ణంలోని డేరాలో కర్ఫ్యూ విధించారు. దీంతో సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ్ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. అపరేషన్ మొత్తాన్ని న్యాయవాది సమక్షంలో జరుగుతుండగా, మొత్తం సర్ఛ్ అపరేషన్ ను వీడియోలలో చిత్రీకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవాళ డేరాలో సోదాలు సందర్భంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డేరాలోని రెండు గదుల నిండా కొత్త కరెన్సీ లభించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వాటిలో రెండు వేల రూపాయల నోట్లే అధికంగా వున్నాయని సమాచారం. ఇక మరో గది నిండా మారణాయుధాలు బయటపడ్డాయని, గుర్మీత్ తో దందాలు నడిపించిన వారి వివరాలతో కూడిన హార్డ్ డిస్క్ లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గదులను సీజ్ చేసిన అధికారులు.. మరికొన్ని గదులలో తనిఖీలను చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more