కర్ణాటకలో ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త, గౌరీ లంకేశ్ హత్యోదంతంపై యావత్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే మరో జర్నలిస్టుపై కాల్పలు జరగడం కలకలం రేపుతుంది. పాత్రికేయ వృత్తి అంటే కత్తిమీద సాములాంటిదని, అయినా దేనీకి వెరవకుండా, అశపడకుండా, లోంగకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించాలన్న తప్పనతో శ్రమింస్తున్న కలం పుత్రులను టార్గెట్ చేయడం పై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
గౌరీ లంకేశ్ ను అమె ఇంటి అవరణలోనే దేశవాలి తుఫాకీతో కాల్చిచంపి.. 48 గంటలు కూడా తిరక్కముందే బీహార్ లో మరో పాత్రికేయుడిపై అగంతకులు కాల్పులతో తెగబడ్డారు. బీజేపి మిత్రపక్షం జేడీయూ అధికారంలో వున్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జంగిల్ రాజ్యం కాకుండా చూస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపి.. ప్రస్తుతం అధికారాన్ని పంచుకుంటున్నా.. ఏకంగా పాత్రికేయులనే టార్గెట్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పాత కక్షలే జర్నలిస్టు మృతికి కారణమా..?
బీహార్ అల్వార్ జిల్లాలో జర్నలిస్టుపై జరిగిన దాడికి పాతకక్షలే కారణమా..? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. హిందీ పత్రిక రాష్ట్రీయ సహారాలో పని చేసే పంకజ్ మిశ్రా అనే జర్నలిస్టుపై ఇవాళ ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సరిగ్గా ఆయన బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదును తీసుకుని బయటకు వస్తుండగా తుపాకీతో కాల్చిన దుండగులు అయన చేతిలోంచి నగదును తీసుకుని పరారయ్యారు. అయితే దుండగులిద్దరూ ఆయన గ్రామానికే చెందినవారేనని గుర్తించిన పోలీసులు వారిలో ఒక్క అనుమానితుడ్ని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత కక్ష వల్లే కాల్పుల కలకలం రేగిందని అల్వార్ ఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more