గత కొన్ని రోజులుగా అమె వెంట పడుతున్న ఇద్దరు యువకులకు ఓ వివాహిత గట్టిగా బుద్ది చెప్పింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని గుర్థాస్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఓ వివాహిత.. ఉద్యోగానికి వెళ్లివస్తున్న క్రమంలో అమె వెంట పడుతున్న ఇద్దరు యువకులు వేధించడం ప్రారంభించారు. ఇలా గత కొన్ని రోజులుగా ప్రతి రోజు జరుగుతుంది. దీంతో వారికి గట్టిగా బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్న వివాహిత.. విషయాన్ని తన భర్తతో పాటు బంధువుల దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో బందువులతో పాటు అమె గ్రామానికి చెందిన పలువురు వివాహితకు అండగా నిలిచారు. పోకిరీలు ఓ కారులో అమెను వెంబడిస్తూ.. వెకిలి చేష్టలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారంతా కలసి జాతీయ రహదారిపైకి వచ్చారు. యధావిధిగా అమె తన విధులను ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో వారు అమెను షరామామూలుగానే వెంబడించారు.
ఈ క్రమంలో జాతీయ రహదారిపైన నిల్చున్న వివాహిత బందువులు కారును అపి అందులో వున్న ఇద్దరు పోకిరీలను కిందకు దించి.. పోలాల్లోకి తీసుకెళ్లి దేహశుద్ది చేశారు. వారి వెకిలిచేష్టలతో కొన్నాళ్లుగా మనోవేదనకు గురైన వివాహితలోనూ కోపం కట్టలు తెంచుకుంది. అమె కూడా వారిని చెప్పుతో కొట్టింది. ఇలా మరే ఇతర మహిళ వెనుక పడినా.. ఇంతకు మించిన స్థాయితో బడిత పూజ చేస్తానని హెచ్చరించింది.
వివాహిత బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివాహత వారిని చెప్పుతో కోడుతున్న సమయంలో అమె గ్రామస్థులు కొందరు ఆ దృష్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more