సాధు జంతువులైన గోవుల పరిరక్షణను చేపడుతున్న గో రక్షకులు.. అ పేరుతో తమతోటి మనుషులపై సాగిస్తున్న హింసాకాండపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న దాడులను నియంత్రించాలని అదేశాలను జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో టాక్స్ ఫోర్స్ టీమ్ లు వుండాలని, వీటికి ప్రతీ జిల్లాలలో సీనియర్ పోలీసు అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించేలా నియామకాలను చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
గో రక్షణ పేరుతో.. కొందరు అమాయక దళితులు, మైనారిటీలపై నేరాలు గోవధ చేశారని, గోమాంసం తరలిస్తున్నారన్న అనుమానాలతో దాడులకు తెగబడి.. వారి ప్రాణాలతో చెలగాటం అడటమేంటని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాలను ప్రశ్నించింది. గో రక్షణ పేరుతో అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ ఎస్ పూనావాలా గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ మేరకు అదేశాలను జారీ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని దాడులు జరిగిన ఆరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా ఇవాళ జరిపిన విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా వారం రోజుల్లో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలని రాష్ట్రాలను సుప్రీం అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more