కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేయగా, ఇవాళ ఫలితాలు వెలువడతున్నాయి. ఈ ఎన్నికలలో తొలి రౌండ్ ఫలితాలు వెలువడగానే టీడీపీ ప్రతిఫక్ష వైసీపీ పార్టీపై పై చేయి సాధించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుతో కౌంటింగ్ ప్రారంభించగా, వాటిలో ఏ ఒక్క ఓటుకు కూడా చెల్లలేదు. మొత్తంగా నంద్యాల ఉపఎన్నికల్లో మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్లు పంపగా... 211 మంది ఏ అభ్యర్థికి ఓటు వేయలేదు. మరో 39 పోస్టల్ బ్యాలెట్లు సరైన చిరునామా లేకపోవడంతో వెనక్కి వచ్చాయి.
ఇక ఆ తరువాత ఎన్నికలకు కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 14 టేబుళ్లపై 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రౌండ్ల వారీగా మెజార్టీని తెలిపేందుకు కౌంటింగ్ కేంద్రం ఎదుటనే పెద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటుచేశారు. మొదట నంద్యాల గ్రామీణంతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 10.30-11.00 గంటల మధ్య పూర్తి ఫలితం వెల్లడవుతుందని అధికారులు చెబుతున్నారు.
తొలిరౌండ్ లెక్కింపు పూర్తయిన తరువాత అధికార టీడీపీ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. ఈ రౌండ్లో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 5,477 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డికి 4,279 ఓట్లు, కాంగ్రెస్కు 69 ఓట్లు, నోటాకు 80 ఓట్లు వచ్చాయి. మొత్తంగా తొలి రౌండ్లో తెదేపాకు 1198 మెజార్టీ లభించింది. తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
రౌండ్ల వారీగా ఫలితాలు:
తొలి రౌండ్: టీడీపీ తొలిరౌండ్లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 5,477, వైఎస్ఆర్ సీపీకి 4,279, కాంగ్రెస్ కు 69 ఓట్లు వచ్చాయి.
రెండో రౌండ్: టీడీపీ 1,762 ఓట్లతో లీడ్ లో ఉంది. టీడీపీకి 5,162, వైఎస్ఆర్ సీపీకి 3400 ఓట్లు. రెండు రౌండ్ల అనంతరం టీడీపీ 2,960 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
మూడు రౌండ్: టీడీపీకి 6,640, వైఎస్ఆర్ సీపీకి 3,553. టీడీపీ 6,047 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
నాలుగో రౌండ్: టీడీపీకి 6,465, వైఎస్ఆర్ సీపీకి 2,859 ఓట్. 3597 ఓట్ల అధిక్యంలో టీడీపీ. మొత్తంగా వైసీసీపై 9670 ఓట్ల అధిక్యంలో టీడీపీ
ఐదో రౌండ్: టీడీపీ 6955, వైసీపీ 3463 ఓట్లు. టీడీపీకి 3492 ఓట్ల అధిక్యం మొత్తంగా 13 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more