రాబందులు అంటే తెలుసా..? నేటి తరం వారికి వీటి గురించి అసలు తెలియదు. అందుకు కారణాలు రెండు. ఒకటి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా. రెండు రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. అసలు రాబంధు అంటే అదో రకమైన పెద్ద పక్షి. చనిపోయిన పశువుల్ని ఎక్కడ వున్నా వాటిపై వాలి వాటిని పూర్తిగా తినేసే పక్షులే రాబంధులు. కళేబరం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా, బ్యాక్టీరియా వ్యాపించకుండా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడేవి. అలాంటి రాబందులు ఇప్పుడు అంతరించే దశకు చేరకున్నాయి. ఒకప్పుడు లక్షల్లో ఉన్న వీటి సంఖ్య… ఇప్పుడు దేశవ్యాప్తంగావందల సంఖ్యలో కూడా లేదు.
అందుకని.. రాబందులను పరిరక్షించేందుకు పార్సీలు చర్యలు మొదలుపెట్టారు. వీరికెందుకు రాబందులపై అంత శ్రద్ద అంటే. పార్సీల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని తీసుకువెళ్లి ఎత్తయిన ప్రదేశంలో వదిలేస్తారు. రాబందులు వాటిని ఆరగిస్తే మంచిదని భావిస్తారు. అయితే ఇప్పుడవి అంతరించడం పార్సీలకు తీవ్ర సమస్యగా మారింది. దీంతో వాటి సంతతిని పెంచే కార్యక్రమానికి రూ. వంద కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఎవరి నమ్మకాలు వారివి.
పర్యావరణం మేలు చేసే రాబందులు సంఖ్య గణనీయంగా తగ్డడంపై అటు పరిశోధకులు, వణ్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాబందులు అంతరించిపోయాయి. 97 శాతానికిపైగా రాబందులు ఇప్పటికే అంతరించగా, మిగిలిన మూడు శాతాన్ని సురక్షితంగా పెంచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ రాబందు కనిపించినా వాటి ఫోటోలను తీసి పంపితే రూ. లక్ష బహుమతిగా ఇస్తామన్న ప్రచారం కూడా జరిగిందంటే.. పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు.
దీంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబంధుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. తెలంగాణ అటవీశాఖ బెజ్జురులోని రాబందుల సంరక్షణపై దృష్టి సారించింది. వీటి సంరక్షణలో భాగంగా పశువులకు జబ్బు చేసినప్పుడు ఇచ్చే ‘డైక్లోఫినాక్’ ఔషదాన్ని నిషేధించింది. ఈ మందు వల్ల జంతువులు చనిపోయిన తరువాత వాటిని తిన్న రాబందులకు సంతానోత్పత్తి కాకపోవడం కూడా కారణమని తెలుసుకున్న పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంతో ఈ మందుపై నిషేధం విధించారు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం, రసాయనాలు కూడా అవి అంతరించిపోవడానికి కారణాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం హరియాణాలోని ‘పింజోర్’, పశ్చిమ్బంగలో రాబందుల సంరక్షణ పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేసింది. అలాగే కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పాలరాపుగుట్టలో వాటి ఉనికి కన్పించడంతో ఆశలు చిగురించాయి. అప్పుడక్కడ పది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సంరక్షణపై దృష్టి పెట్టడంతో ఇప్పుడవి 30కి పైగా ఉన్నాయి. రాబందుల సంరక్షణ, ప్రత్యుత్పత్తి, పెరుగుదలపై అటవీశాఖ జాగ్రత్తలు తీసుకుంటుండటంతో రాబందులకు రాజయోగం పట్టిందని ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more