డోక్లామ్ లోని ట్రై జంక్షన్ ప్రాంతంలో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, అందుకు చర్చలు ఒక్కటే మార్గమని అమెరికా సలహా ఇచ్చింది. ఆయ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను ఇరు మాత్రమే పరిష్కరించుకోగలరని అమెరికా పేర్కొంది. రెండు వర్గాలనూ కూర్చుని చర్చలు జరపాలని మాత్రమే తాము చెప్పగలమని అమెరికా ప్రతినిధి హెదర్ నౌరెట్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఈ తరహా ఉద్రిక్త పరిస్థితి రెండు దేశాలకూ మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు.
కాగా, గత జూన్ లో డోక్లామ్ ప్రాంతంలో డ్రాగన్ సైన్యం రహదారి నిర్మాణానికి పూనుకోగా, భారత్ సైన్యం అడ్డుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాంతం తమదంటే తమదని రెండు దేశాలూ వాదనలకు దిగుతూ, ఇరువైపులా తమ తమ సైన్యాలను మోహరించాయి. ట్రై జంక్షన్ పాయింట్లను చైనా అతిక్రమిస్తోందని భారత్ ఆరోపిస్తుండగా, ఈ ప్రాంతం తమదేనని నెహ్రూ హయాంలోనే రాతకోతలు జరిగాయని చైనా అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే.
డోక్లామ్ లో నెలకోన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సరిహద్ద వెంట వున్న ఐదు ప్రాంతాల్లో భారత్- చైనా సైన్యాలు సమావేశం కావడం అనవాయితీగా వస్తుంది. జమ్ముకాశ్మీర్ లోని దౌలత్ బేగ్, చుషూల్, అరుణాచల్ ప్రదేశ్ లోని కిబిథూ, బుమ్లా, సిక్కింలోని నాథూలా వద్ద ఈ భేటీలు గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. కానీ ఉద్రక్తత నేపథ్యంలో దేశ 71వ వేడుకల నేపథ్యంలో మాత్రం ఈ ఐదు ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా సమావేశం జరగలేదని ఆర్మీ ప్రకటించింది.
రివాజుగా వస్తున్న ఈ అనవాయితీ సమావేశాలకు రావాల్సిందిగా భారత్ చైనా అధికారులకు సమాచారం అందించి.. ఫోన్ ధ్వారా కూడా మరోమారు విన్నవించినా వారి నుంచి స్పందన రాలేదని అర్మీ వర్గాలు తెలిపాయి. ఇక అదే అదనుగా భావించిన చైనా బలగాలు.. లడఖ్ ప్రాంతంలో ప్యాంగ్యాంగ్ సరస్సుకు భారత్ వైపు ఉన్న ఒడ్డున.. ఫింగర్ ఫోర్, ఫింగర్ ఫైవ్ ప్రాంతాల్లో చొరబాటుకు ప్రయత్నించాయి. భారత బలగాలు అప్రమత్తంగా వ్వవహరించి చైనా చొరబాటును తిప్పికొట్టాయి. దీంతో తోకముడిచిన చైనా బలగాలు.. భారత బలగాలపై రాళ్లదాడికి పాల్పడ్డాయి. అయినా వెనక్కు తగ్గని భారత బలగాలు చైనా మూకలను ధీటుగా ఎదుర్కోన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more