గ్యాంగ్ స్టర్ నయీమ్ ను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఆగష్టు 8వ, తేదిన జరిగిన షాద్ నగర్ లోని మిలినీయం సిటీలో నయీమ్ చనిపోయిన తరువాత జరిపిన దాడుల్లో పెద్దఎత్తున బంగారంతో పాటు, ఆయనతో అంటకాగిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల వివరాలు, నగదు, భూ దందాలకు సంబంధించిన పత్రాలు తాము స్వాధీనం చేసుకున్నామన్న ప్రకటన తప్ప, ఇంతవరకూ కేసు కోర్టుకు ఎక్కింది లేదు. ఈ గ్యాంగ్ స్టర్ తో కలసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన వారి అరెస్టులూ లేవు. ఈ కేసు విచారణ ఏడాదిగా సాగుతూనే ఉంది.
నయీంతో సంబంధాలు కలిగి ఉన్న ఓ పోలీసు అధికారి ఏకంగా 16 ఎకరాల స్థలాన్ని తీసుకొన్నట్టు సిట్ గుర్తించింది.2008 తర్వాత ఛత్తీస్ ఘడ్ కు చెందిన కొందరు ఐపీఎస్ అధికారులు
నయీంతో సంబంధాలను కలిగి ఉన్నారని సిట్ దర్యాప్తులో తేలింది. వాళ్లందరి పేర్లు తప్పించేందుకు గట్టి యత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా ఉన్న కేసు పురోగతి ఏంటన్న దానిపై అధికారులు ఓ ప్రకటన చేశారు. నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత 31 కేసులను నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 9 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.
త్వరలోనే మిగతా 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామని ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తున్న ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఏడాదిగా నయీమ్ దందాలపై పలు ప్రాంతాల్లో 227 కేసులు నమోదయ్యాయని, మొత్తం 895 మంది సాక్షులను విచారించామని సిట్ ఓ ప్రకటనలో తెలిపింది.మరో వైపు చర్యలు తీసుకునే అంశంపై స్పందిస్తూ.. తమపై ఒత్తిళ్లు ఏం లేవని, నయీమ్ తో అంటకాగిన వారిలో 128 మందిని అరెస్ట్ చేసి, ఆపై 109 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించామని సిట్ స్పష్టం చేసింది. దర్యాఫ్తు తుది దశకు చేరిందని చెబుతూ.. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ను కూడా విచారించామని, ఐదుగురు పోలీసు అధికారులు సస్పెండ్ కు గురయ్యారన్న విషయాన్ని ప్రస్తావించింది. ఇక కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, దీన్ని త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more