దేశ ఆర్థిక రాజధాని ముంబై.. కొత్తగా దేశ నేర రాజధానిగా మారిందా..? అన్న అనుమానాలు కలగక మానవు. అక్కడ అత్యంత దారుణ నేరాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కలకలం రేగుతుంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా నేరాలకు ముంబై అడ్డాగా మారుతుంది. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన యావత్ సమాజాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేస్తుంది. డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరీ ప్రాంతంలో నివసించే ఓ 16 ఏళ్ల బాలుడిపై ఏడాది కాలంగా 15 మంది తన తోటి మైనర్ విద్యార్థులే అసహజ సిద్దమైన లైంగిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని బయటకు చెప్పితే చంపుతామని బెదిరించడంతో పాటు.. అతని వీడియోను సోషల్ మీడియాలో పెడతామని కూడా బెదిరింపులకు గురిచేశారు.
గత నెలలో మున్సిఫల్ పాఠశాల వెనుకనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు 15 మంది అతడిపై చివరగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ లైంగిక దాడి నేపథ్యంలో బాలుడు తీవ్ర నొప్పితో బాధపడుతూ ఈ విషయాన్ని తనకు క్లోజ్ గా వుండే 31 ఏళ్ల వ్యక్తికి తెలిపాడు. అతని సలహా మేరకు పోలీసులను ఆశ్రయించాడు. తొలుత నిర్ఘాంతపోయిన పోలీసులు బాలుడి విషమ పరిస్థితిని చూసి కేసు నమోదు చేశారు. అనంతరం బాలుడ్ని వైద్య పరీక్ష నిమిత్తం అస్పత్రికి తరలించగా, అతడిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధృవీకరించారు.
వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల బాలుడ్ని గత ఏడాది ఇంటి పక్కనే వుండే మరో బాలుడు నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతేకాదు అ అత్యాచారాన్ని తన మొబైల్ ఫోన్ లో వీడియో తీశాడు. దాన్ని స్నేహితులకు షేర్ చేశాడు. ఈ వీడియోను బాధితుడికి చూపించి తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. నిర్జన ప్రాంతాల్లో వారు ఒకరి తరువాత మరోకరు లైంగికదాడికి పాల్పడేవారు. కాగా నిందితుల్లో ఒకడు రెస్టారెంట్లో తినడానికి తనకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని బాధితుడ్ని అడిగాడు. అయితే తన వద్ద లేని కారణంగా బాలుడు ఇవ్వలేదు. దీంతో జూన్ 26న చివరి సారిగా బాలుడిపై 15 మంది మరోసారి అత్యారాం చేశారు.
ఆ తరువాత బాధితుడికి తీవ్రంగా కడుపులో నొప్పి రావడంతో తనతో క్లోజ్ గా వుండే భవన నిర్మాణ సూపర్ వైజర్ కు విషయాన్ని చెప్పాడు. దీంతో అతని సాయంతో పోలిసులను అశ్రయించి పిర్ాయదు చేశాడు. తనపై అత్యాచారానికి పాల్పడేందుకు తనను తీసుకెళ్లే సమయంలో తప్పించుకునేందుకు పలు సందర్భాలలో ప్రయత్నించానని, అయితే తనను వెంబడించిన బాలురు తీవ్రంగా కొట్టెవారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసహజ సిద్దమైన లైంగిక చర్యకు పాల్పడిన 15 మంది బాలురపై పోలీసులు ఐపీసీ పిల్లల సంరక్షణ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎన్ నగర్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు 2016లో బాలుడి ఇంటి పక్కనే ఉండే మరో బాలుడు అత్యాచారం జరుపుతూ వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను అతని స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను చూపి బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయడం ప్రారంభించాడు. బాలుడిని నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం జరిపేవారు. నిందితుల్లో ఒకరు బాలుడిని రెస్టారెంట్ వెళ్లి తినడానికి డబ్బులు ఇవ్వాలని బెదిరించగా బాధితుడు నిరాకరించాడు. దీంతో నిందితులు జూన్ 26 మరో సారి అత్యాచారం జరిపారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more