ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో జరగనున్ను రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మునుపెన్నడూ లేని విధంగా గుజరాత్ రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నోటా బటన్ ను వినియోగించనున్నారు. అయితే ‘పై వారెవరూ కాదు అని తెలిపే నోటా బటన్ ను రాజ్యసభ ఎన్నికలలో వినియోగించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలలో నోటా బటన్ తోనే జరుగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గతంలో మాదిరాగా కాకుండా ఈ సారి ఎన్నికలలో నోటా బటన్ విధానాన్ని తీసుకురావడంతో సుప్రీంకోర్టును అశ్రయించిన కాంగ్రెస్.. నోటా బటన్ పై స్టే విధించాలని కోరుతూ పిటీషన్ వేసింది. అయితే ఈ పిటీషన్ ను క్రితం రోజున విచారణకు స్వీకరించిన న్యాయస్తానం.. ఇవాళ విచారించింది. మునుపటిలా కాకుండా ఈ సారి జరగనున్న ఎన్నికలలో నోటా బటన్ ను వినియోగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యసభ ఎన్నికల్లోనే తొలిసారిగా నోటా విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పిటిషన్ను తోసిపుచ్చింది. నోటాతోనే గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.
ఈ నెల 8న గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని వినియోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ బ్యాలెట్ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో వెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. గుజరాత్ అసెంబ్లీ ద్వారా మూడు స్థానాలకు జరగనున్న ఎన్నికలలో బీజేపి తరపున కేం్దరమత్రి సృతి ఇరానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు బరిలో నిలువగా, కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more