భారత దేశం భిన్న సంస్కృతులకు మాత్రమే నిలయం కాదు. సర్వమత సౌభ్రాభృత్వానికి కూడా అవాసమే. దశాబ్దాల క్రితం దసరా పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుని అలాయ్, భలాయ్ అంటూ హిందు మిత్రుల కుటుంబాలను వారింట్లో బోజనానికి పిలిచేవారు. అదే తరహాలో పీర్ల పండగను ముస్లింల నేతృత్వంలో జరిగినా.. వాటిని అధికంగా హిందూమతస్థులే పాల్గోనేవారు. మరో విధంగా చెప్పాలంటే.. పీర్ల, దర్గాలను దర్శించేవారిలో హిందువుల సంఖ్యే అధికంగా వుండేది. అయితే కాలక్రమేనా మతఛాందసవాదం పెరగి.. హిందూ, ముస్లింల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుకుపోయింది.
అయితే రాజకీయ నేతలు, మతఛాందసవాదులు ఎంతగా బేధాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నించాని. దేశంలో మాత్రం హిందూ, సిక్, ఇసాయి, అంతా భాయి భాయి అన్నట్లుగా వారి మధ్య సోదరభావం, మతసామరస్యం వుంటుందని చాటి చెపుతుంది. మతసామరస్యం మతోన్మాద శక్తుల అండతో పేట్రేగిపోతూ.. దేశంలో రావణ కాస్టాన్ని రగుల్చుతూ.. వేర్పాటు వాదులు నిత్యం హింసకు దిగుతున్న జమ్మూకాశ్మీర్ లోని ఓ ఫోటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లో సర్వమత సోదరబావాన్ని చాటుతున్న ఈ ఫోటోకు ఏకంగా 7 లక్షల లైకులు వచ్చాయి.
ఈ విషయం భారత్ నిజంగా పుణ్యభూమని, కర్మభూమని చాటిచెబుతుంది. ఈ ఫోటోను లక్షకు పైగా రీట్వీట్లు వచ్చాయి. ఈ ఫొటోను చూసి గర్వించని భారతీయుడే లేడని కామెంట్లు వస్తున్నాయి. ఆ ఫొటోను శ్రీనగర్ కు చెందిన సీఆర్పీఎఫ్ కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు జవాన్లు కాపలాగా ఉన్న ప్రాంతంలో నమాజుకు సమయమైన సమయంలో తీసిన ఫొటోలు ఇవి. ఓ జవాను నమాజు చేస్తుండగా, మరో జవాను కాపలాగా నిలబడ్డాడు. 'బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ ఫర్ పీస్' పేరిట క్యాప్షన్ పెట్టిన సీఆర్పీఎఫ్ దీన్ని విడుదల చేయగా, ఇదే నిజమైన భారతావని అని నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
"Brothers-in-arms for peace" - CRPF Srinagar pic.twitter.com/QfsOIKbHoa
— Srinagar Sector CRPF (@crpf_srinagar) July 29, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more