గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. 17 ఏళ్ల స్నేహాన్ని వదులుకుని.. ఆ తరువాత వచిచన బీహార్ రాష్ట్ర ఎన్నికలలో మహాగట్ బందన్ పేరుతో కాంగ్రెస్, అర్జేడీలతో కలసి పోటీ చేసని నితీష్ రక్తంలోనే వ్యతిరేకతా బావం వుందా..? అంటే అవుననే అంటున్నారు బీజేపి బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సుషీల్ కుమార్ మోడీ. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత భావం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రక్తంలోనే ఉందని అన్నారు.
మహాగట్ బందన్ పేరుతో నితీశ్ లాంటి నిజాయితీ పరుడు.. అవినీతి పరుడైన అర్జేడీ అధినేత లాలూ లాంటి వ్యక్తుల ముందు మోకరిల్లలేదని.. ఇది ఆహ్వానించదగిన పరిణామమని ఆయన చెప్పారు. మహాగట్ బంధన్ అసహజమైన భాగస్వామ్యం అని మోదీ వర్ణించారు. 2019నాటి ఎన్నికల్లో నితీశ్- మోదీల భాగస్వామ్యం రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించనుందని, లోక్సభ ఎన్నికల్లో తమ కూటమి స్థానాలన్నీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే నితీశ్ మహాకూటమి నుంచి విడిపోయేందుకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపి ఇవే విషయాలను ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయిందని నెట్ జనులతో పాటు.. లాలూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. బీహార్ ఎన్నికలకు ముందు లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన నరేంద్రమోడీ.. రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క పైసాను కూడా ఎందుకు విధిల్చలేదని నిలదీస్తున్నారు. బీహార్ రాష్ట్ర అభివృద్ది పేరు చెప్పి బీజేపి పార్టీ.. నితీశ్ ను లొంగదీసుకుని ప్రజాతీర్పును అపహాస్యం చేసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. స్వార్థరాజకీయాలను పక్కనబెట్టి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం కోసం శ్రద్ద వహించాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more