దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎన్ ఖేహర్ కోవింద్ చేత రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ హాయంలో ఆర్ నారాయణన్ తరువాత.. మళ్లీ అత్యున్నత పదవికి ఎన్డీఏ హయాంలో మరో దళిత వర్గానికి చెందని నేత ఎన్నుకోబడ్డారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. వేదికపై మరో వైపున ఉప రాష్ట్రపతి హమీద్ అన్సరీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అసీనులైవున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ చేసిన తొలి ప్రసంగం అహుతులను అకట్టుకుంది. దేశ రాష్ట్రపతిగా పూర్తి గౌరవంతో తాను స్వీకరిస్తున్నాని చెప్పారు. తాను ఓ మారుమూల గ్రామంలో ఓ మట్టి ఇంట్లో జన్మించానని చెప్పారు. రాష్ట్రపతి హోదాకు గౌరవాన్ని తీసుకువచ్చిన మహనీయుల అడుగుజాడల్లోనే తానూ నడుస్తానని చెప్పారు. తనపై దేశ ప్రజలు వుంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని అన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు.
అనేక బాషలు, విభిన్న సంస్కృతుల సమ్మెళమైన మన దేశం భిన్నత్వంలో ఏకత్వాని చాటుతుందని అన్నారు. అందుకే యావత్ ప్రపంచాన్ని భారత సంస్కృతి సంప్రదాయాలు అకట్టుకుంటున్నాయని అన్నారు. దేశంగా మనం ఎన్నో మైలురాళ్లను అధిగమించామని చెప్పిన రాష్ట్రపతి.. అదే ఐక్యత, అదే పట్టుదలతో మరెన్నీ లక్ష్యాలను కూడా అధిగమించాలని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛా, సోదరబావం భారత్ సొంతమని చెప్పారు. అయితే సమానత్వం, అర్థిక లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.
దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్న సైనికులు, పోలీసుల త్యాగం మరువలేనిదని అన్నారు. అదివాసీలు, రైతులు మొదలుకుని దేశం అభివృద్దిలో పాలుపంచుకుంటూ అహర్నిశలు కష్టపడుతున్న ప్రతీ ఒక్కరూ నిజమైన జాతి నిర్మాతలేనని అన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా సేవలందించానని చెప్పారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాలులో వున్న ప్రముఖల వద్దకు చేరుకుని వారి అభినందనలు అందుకుని మర్యాదపూర్వక వందనాలు చేశారు.
రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, దేవె గౌడ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపి అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు, పలు పార్టీల అధినేతలు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత రాజాజీ మార్గ్ లోని ఆయన నూతన నివాసానికి చేరుకున్నారు.
అంతకుముందు ఇవాళ ఉదయం రామ్ నాథ్ కోవింద్ రాజ్ ఘాట్ లోని మహత్మా గాంధీ సమాధి వద్దకు చేరకుని జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీకి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అక్కడ ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీతో కలసి పార్లమెంట్ భవనానాకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి కోవింద్ కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more