కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి మధ్య వివాదం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసిన నారాయణ స్వామి ప్రభుత్వం.. ప్రభుత్వ పాలనలో అనునిత్యం జోక్యం చేసుకుంటుందని మెడికల్ కాలేజీల విషయాల నుంచి అన్ని విషయాల్లోనూ అమెదే పైచేయిగా కొనసాగాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అరోపిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఈ నెల 4న రాష్ట్రంలోని నారాయణ స్వామి ప్రభుత్వానికి ఇసమంతైనా సమాచారం లేకుండా.. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సూచించిన ముగ్గురు బీజేపి నేతలను అమె ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం.. వారితో ప్రమాణస్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. కిరణ్ బేడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఎదురుదాడికి దిగుతున్నారు. కిరణ్ బేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ లా చూపిస్తూ, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అభ్యంతరకర పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పోస్టర్లో కిరణ్ బేడీకి హిట్లర్ లా మీసం పెట్టి ఆమెను అవమానించేలా వున్నాయి. కిరణ్ బేడీనీ ఇలా చూపించడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఒక గవర్నర్ ను అందులోనూ మహిళను ఇంత దారుణంగా అవమానిస్తారా..? అంటూ చర్యలకు ఉపక్రమించిన్నట్టు సమాచారం. అయితే ఈ పోస్టర్లపై కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ.. కిరణ్ బేడీ ఫోటోపై కేంద్రానికి వున్న ప్రేమ ఒక ప్రజాస్వామ్య దేశంలో.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఇవే పరిణామాలు ఎదురైతే.. అదెంత అవమానమని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోకి ఎక్కి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసింది ఎవరని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more