హైదరాబాద్ లో ఓ మహిళపై అఘాయిత్యం జరిగింది. పని ఇప్పిస్తానంటూ ఓ న్యాయవాది ఓ గృహిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు ఓ సెక్యూరిటీ గార్డు అతనికి సహకరించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పొట్టకూటి కోసం నగరానికి వలసవచ్చి.. భర్త అహర్నిషలు కష్టపడుతున్నా.. కష్టానికి తగ్గ డబ్బు రావడం లేదని.. భర్తకు చేదుడువాదోడుగా నిలిచేందుకు తాను కూడా ఏదైనా పనిచేయాలని భావించింది యూసఫ్ గూడకు చెందిన 43 ఏళ్ల మహిళ. అమెకు స్థానికంగా వుండే కృష్ణ అనే సెక్యూరిటీ గార్డు పరిచయం కావడంతో.. ఏదైనా ఇంట్లో పనుంటే చూసిపెట్టన్నా.. అని సోదరుడ్ని అడిగినట్లు అడిగింది. అయితే అన్నా అన్న పదం విన్న తరువాత కూడా ఈ గోముఖవ్యాఘ్రం మనస్సు కరగలేదు. తన సొంత తోబుట్టువే ఇలా అడిగితే.. తాను ఇలాంటి పనిచేస్తానా.. అని కూడా అలోచించిలేదు.
కొన్ని రోజుల తరువాత సెక్యూరిటీ గార్డు కృష్ణ.. ఆ మహిళకు ఓ అడ్వకేట్ ఇంట్లో పనిమనిషి అవసరం ఉందని కబురు పెట్టాడు. గత నెల 29 మధ్యాహ్నం ఆమెను నాగోల్ కు పిలిపించి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక సెక్యూరిటీ గార్డ్ కృష్ణ, అడ్వకేట్ ప్రకాష్. ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో యూసఫ్ గూడలోని ఆమె నివాసం వద్ద వదిలి వెళ్లారు. తనకు స్పృహ వచ్చే సమయానికి విపరీతమైన నొప్పితో పాటు రక్తస్రావం అయ్యిందని బాధితురాలు తెలిపింది.
నాగోల్ లో అడ్వకేట్ ప్రకాష్ ఇంటికి వెళ్లినంత వరకు తనకు గుర్తుందని, ఆ తరువాత తనకేం జరిగిందో తెలియదని బాధితురాలు అవేదన వ్యక్తం చేసింది. అయితే తనకు అనారోగ్యం కారణంగా ఇలా జరిగింగానన్న ఆందోళనకు గురైన బాధితురాలు.. ఇన్ని రోజులు తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని భయంతో ఎవరికి చెప్పుకోలేదు. అయితే సమీప బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. అఘాయిత్యానికి సంబంధించి వీడియోలు కూడా తీసివుంటారని అనుమానాన్ని వ్యక్తం చేసింది. అలాంటివి వుంటే స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వాళ్లిద్దరి కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more