జీడిపప్పు ఎగుమతులతో ఖ్యాతి గడించిన ప్రముఖ కేరళ వ్యాపారవేత్త రాజమోహన్ పిళ్లైను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జీడిపప్పుతో పాటు బిస్కెట్ వ్యాపార రంగంలో పోటీ సంస్థలతో ధీటుగా రాణిస్తున్న రాజమోహన్.. తన ఇంట్లో పనిచేసే యువతిని వరుసగా పలుమార్లు అత్యాచారాలకు పాల్పడినట్లు అభియోగాలను నమోదు చేసిన కేరళలోని తిరువనంతపురం మ్యూజియం పోలీసులు అయనను అరెస్టు చేశారు.
బిస్కెట్ వ్యాపార రంగంలో రారాజుగా వెలుగోందిన రాజన్ పిళ్లై అఖరు తమ్ముడైన రాజమోహన్ పిళ్లై (53)ని పోలీసులు అరెస్ట్ చేయడం కేరళ వ్యాపారవేత్తలలను కలవరానికి గురిచేసింది. ఆయన సోదరుడు రాజన్ పిళ్లై కూడా ఓ కుట్ర కేసులో శిక్షను అనుభవిస్తూ.. 1995లో తిహార్ జైలులో వుండగా అస్వస్థతకు గురై అసువులు బాశాడు. దీంతో అన్న మాదిరిగానే తమ్ముడు కూడా జైలు పాలు కావడంతో బెటా గ్రూపుతో వాణిజ్య సంబంధాలు నెరుపుతున్న వ్యాపారవేత్తలలో అందోళన రేగుతుంది. అసలేం జరిగిందంటే...
ఒడిశాకు చెందిన ఓ యువతి ఆయన వద్దకు ఉద్యోగం నిమిత్తం వచ్చింది. అయితే ఉద్యోగం పేరుతో తన ఇంట్లోనే పెట్టుకున్న రాజమోహన్ పిళ్లై.. అమెపై గత ఎనమిది నెలలుగా పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఈ క్రమంలో, ఆమె గర్భందాల్చింది. దీంతో, అమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా చెప్పిన రాజమోహన్ అమె వెంట తన నమ్మకస్తుడైన వ్యక్తిని పంపాడు. బాధితురాలు ఆసుపత్రికి వెళ్లి తనకు అబార్షన్ చేయాల్సిందిగా వైద్యులను కోరింది. అమె ప్రవర్తనపై అనుమానం కలిగిన వైద్యుడు.. అమెను వివరాలు తెలుసుకున్నాడు.
ఒడిషా వచ్చిన తన సహచరుడిని పిలిచిన డాక్టర్ అమెను ఒడిషాలో ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. పిళ్లై తనను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె అవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకున్నాడని చెప్పింది. డాక్టర్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో సైతం ఆమెపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పిళ్లై మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more